Suryaa.co.in

Telangana

రైతు బంధుపై మా లెక్కలు తప్పయితే జైలుకు వెళ్తాం

తెలంగాణ వేదికగా జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో
6న తెలంగాణ జనజాతర సభలో విడుదల
తెలంగాణ ప్రాంతం, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ప్రత్యేకం
తెలంగాణకు సోనియమ్మ కుటుంబం మరీ ప్రత్యేకం
సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలి
కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది
పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే కలుగు నుంచి బయటకొచ్చారు
రైతుబంధుపై మా లెక్కలు తప్పని నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధం
హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
తుక్కుగూడ విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ వేదికగా ఈ నెల 6న తెలంగాణ జనజాతర సభలో విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తుక్కుగూడలో మంగళవారం విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి వివరాలు వెల్లడిరచారు. ఆరు గ్యారంటీలను మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది…మిగతా హామీలను ఎన్నికల కోడ్‌ తరువాత వందశాతం అమలు చేస్తాం. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతాం…ఇప్పుడు ఇదే వేదికగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసుకోబోతున్నాం. జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడం అంటే మా కార్యకర్త కష్టాన్ని అధిష్టానం గుర్తించినట్లుగా చెప్పుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని పిలుపినిచ్చారు. ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో సభకు తరలి వచ్చి ఆశీర్వదించాలని కోరారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌
కేసీఆర్‌ పొలం బాట పట్టడం సంతోషం.. పదేళ్ల తరువాత తెలంగాణ రైతులున్నారని కేసీఆర్‌కు గుర్తొచ్చినందుకు సంతోషం. అధికారం పోకుండా ఉండి ఉంటే.. కిందపడి గాయం కాకుండా ఉంటే.. కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే ఆయన ఎవరికీ దొరికే వారు కాదు.

కాంగ్రెస్‌ వచ్చింది కరువు వచ్చింది అని కేసీఆర్‌ అంటుండు. మేం అధికారంలోకి వచ్చిందే చలి కాలంలో… వర్షాకాలంలో అధికారంలో ఉన్నది వాళ్లే…కేసీఆర్‌ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి పారిపోయాడు.. కేసీఆర్‌.. నువ్వు చేసిన పాపాలను మాపై రుద్దాలని చూడొద్దు..మీ పాలనలో 20 రోజులు వానలు పడకపోవడం వల్లే 24లో కరువు వచ్చింది.. 64,75,581 మంది రైతుల ఖాతాల్లో మా ప్రభుత్వం రైతు బంధు వేసింది. ఇంకా మిగిలింది 4 లక్షల ఖాతాలు మాత్రమే. ఎన్నికల కోడ్‌ ముగియగానే మిగతా రైతులకు రైతు బంధు చెల్లిస్తాం…మేం చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం..మేం చెప్పిన లెక్కలు వాస్తవమైతే తెలంగాణ రైతులకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలికసీఆర్‌ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదు..సూర్యాపేట ప్రెస్‌ మీట్‌ లో కేసీఆర్‌ మైక్‌ జనరేటర్‌ కు కనెక్ట్‌ అయి ఉంది..నీ జనరేటర్‌ లో ఎవడు పుల్ల పెట్టాడో ఎవరికి తెలుసు..మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి… ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నీవు చేసిన పాపం కొంతైనా తగ్గేది. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌ నక్కజిత్తుల వేషాలు..పొగ పెట్టగానే కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు…ఎన్నికలు అనే పొగ పెట్టడంతో కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు.

ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్‌ నిప్పులు పోసుకుం టున్నారు..కేసీఆర్‌ పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుంది..కేసీఆర్‌ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వారు..ప్రతీ వారం కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నేరవేర్చాలి.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం.. జూన్‌ 9న ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తుంది. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులేనన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ వాళ్ల బాస్‌ మోదీ గెలవాలని.. కాంగ్రెస్‌కు 40 రావాలని కోరుకుంటున్నారు.. కేసీఆర్‌ కు 48 గంటల సమయం ఇస్తున్నా…చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వండి…నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE