Suryaa.co.in

Andhra Pradesh

చేతకాకపోతే తప్పుకోండి.. నిజానిర్ధారణ కమిటీ వేయండి

* భారత చైతన్య యువజన పార్టీ అధినేత టీటీడీకి రామచంద్ర యాదవ్ సవాల్
* గోశాల నిర్వహణ చేతకాకపోతే తనకు అప్పగించాలని డిమాండ్..
* గోశాలలో ఏడాదిలో 191 గోవులు మృతి చెందడంపై ఆవేదన..
* ⁠ఈ పాపాత్ములను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్..
* ⁠నిజనిర్ధారణకు కమిటీ వేయాలని సూచన

విజయవాడ: టీటీడీ గోశాలలో గోవుల మృతి.. అస్తవ్యస్థ నిర్వహణపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.. “మూగ జీవాలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలకు మనల్ని పరిపాలించే హక్కు లేదని.. వెంటనే టీటీడీ పాలక మండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. గోశాల నిర్వహణ చేతగాకపోతే తనకు అప్పగించాలని సవాల్ చేసారు.

“మన బతుకులకు మూలాధారంగా ఉన్న గోవులకు సరైన దానా పెట్టలేక.. తాగునీరు ఇవ్వలేక.. సుస్తీ చేస్తే నయం చేయలేక.. వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏడాదిలో 191 గోవుల మృతికి కారణమాయ్యారు.. గత ప్రభుత్వ.., ఈ ప్రభుత్వ పాలకులను చట్ట ప్రకారం శిక్షించాలి“ అని ఆయన పేర్కొన్నారు.

టీటీడీ గోశాల అధికారులు అధికారికంగా వెల్లడించిన లెక్క ప్రకారం 191 జీవాల మరణం.. అనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.. దీనిపై నిజాలు వెల్లడికి హిందూ సంఘాలు. ., స్వామిజీలు.., భక్తులు.., దాతల తరపున ఒక నిజ నిర్ధారణ కమిటీ నియమించాలని సూచించారు.

. “టీటీడీ ప్రకటించిన లెక్కలపై మాకు నమ్మకం లేదు. గోశాల విషయంలో రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.. వాస్తవాలు చెప్పడం లేదు.. ఇరు పక్షాలది పాపం కనిపిస్తుంది. అందుకే తటస్థులతో ఒక కమిటీ నియమించాలని కోరుతున్నాను.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే మేమే ఓ కమిటీ వేసేందుకు అలోచించి.., నిజాలను తెలుసుకునేందుకు నేరుగా వెళ్తాం“ అని రామచంద్ర యాదవ్ తెలిపారు..

LEAVE A RESPONSE