Suryaa.co.in

Andhra Pradesh

ఫ్యాన్ కి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే

-జగన్ వస్తే మీ భూమి మీది కాదు
-ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం
-మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి
-జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి
-పాసుపుస్తకంపై జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తాం
-ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జెండాల ఎజెండా
-ఉండి ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఉండి: ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు రావడం సంతోషకరం. సిద్ధాంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రామరాజు ఒక్క మాట మాట్లాడకపోవడం నా జీవితంలో అరుదైన అనుభవం. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే మూడు జండాల అజెండా. అరాచకానికి ప్రభుత్వం పరాకాష్ట.

రాష్ట్రాన్ని ఒక అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు పాలన చేస్తున్నారు. జగన్ ను రఘురామకృష్ణ రాజు విబేధించారని చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎంపీని ఇబ్బందులకు గురి చేశారు. సీబీసీఐడీ అరెస్ట్ చేసి టార్చర్ పెట్టి వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తారు. మేం రాత్రంతా మేలుకొని సుప్రీం కోర్టులో కేసులు వేశాం. ఆయనను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. జగన్ ఒక సైకో అనిచెప్పడానికి రఘురాంకృష్ణరాజుపై జరిగిన దాడే ఉదాహరణ. ఒక ఎంపీని పార్లమెంట్ నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకున్నారు.

అన్ని ధరలను ఆకాశనంటించారు
ఎన్నికలు ఇక మూడు రోజులే పోలింగ్ స్టేషన్లు దద్దరిల్లిపోవాలి. ఎండ ఉందని ఇంట్లో పడుకుంటే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. రూ.10 ఇచ్చి రూ.100 ప్రజల నుంచి లాక్కుంటున్నారు. ప్రజల ఆస్థులను కొల్లగొట్టి రూ.1000 దోచుకున్న బందిపోటు జగన్. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంట్ చార్జీలు, పన్నులు ధరలు పెరిగిపోయాయాలి. రూ.60 క్వార్టర్ బాటిల్ రూ.200 పెరిగింది. అన్ని జగ్గూభాయ్ బ్రాండ్లే. ఒక క్వార్టర్ తాగితే కిక్కు రాదు, రెండో క్వార్టర్ తాగితే కడుపులో మంట పెరుగుతుంది.

పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర స్థానంలో జగన్ బొమ్మ ఎందుకు?
అన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000 ఇప్పుడు రూ.5000 పెంచారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టన కొట్టారు. నాశిరకం మద్యంతో మహిళల మాంగళ్యాలు తెంచారు. మట్టి, భూమి, భూగర్బ ఖనిజ సంపద, ఆస్తులు కొట్టేసిన వ్యక్తి జలగ జగన్. మీ భూమి మీదా? పట్టాదారు పాసుపుస్తకం మీద ఉండాల్సింది ప్రభుత్వ రాజముద్ర. కాని దీని మీద జగన్ ఫోటో ఎందుకు ఉంది? అంటే జగన్ రెడ్డి నా అంటే నాశనం చేస్తారనే అర్ధం. నా ఎస్సీలంటూనే దళితులను చంపి డోర్ డెలివరి చేశారు. నా బీసీ అంటే స్కీములన్ని రద్దు చేశారు. మీ బిడ్డ అంటూనే మీ భూములు కాజేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాదారు పాసుపుసక్తం మీద జగన్ బొమ్మ తీసేసి ప్రభుత్వ రాజముద్ర వేయిస్తాను.

జగన్ వస్తే మీ భూమి మీది కాదు
మీ భూమి తాకట్టు పెట్టి జగన్ ఇష్టప్రకారం చేసుకుంటారంటా? టైటిల్ రిజిస్టర్ అనే జగన్ గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్ని ఆయన కంట్రోల్ లో పెట్టుకుంటారు. ఎవరవైనా ఈ భూమి నాది అంటే వాటిని డిస్ ప్యూట్ కి పంపిస్తారు. ఇప్పటికే కొంత మంది భూ రికార్డులు మారుస్తున్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే ప్రజల భూములు గోవిందా గోవిందా? మీ మెడకు ఉరి వెయ్యాలని జగన్ ఆలోచించారు. కాని ప్రజలు ఫ్యాన్ కి ఉరి వెయ్యాలి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. మొదటి సంతకం డీఎస్సీ, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాయింగ్ చట్టాన్ని రద్దు చేస్తాను. ఈ చట్టాన్ని ఈ రోజు సాయంత్రం మీ ఊర్లో కాల్చేయండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఏదైనా ప్రశ్నిస్తే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ పెడతారు.

జగన్ ఒక్క హామీ నెరవేర్చ లేదు
నేను ఉండి రాకపోయినా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. జలగ పచ్చి మోసగాడు. మద్యపాన నిషేదం చేశాకే ఓటు అడుగుతానన్నాడు. చేశాడా? ఓటు అడిగే హక్కు ఉందా? సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నాడు చేశాడా? ఓటు అడిగే హక్కు ఉందా? విద్యుత్ చార్జీలు పెరగవని చెప్పి 9 సార్లు పెంచాడు? ఓటు అడిగే హక్కు ఉందా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఓటు అడిగే హక్కు ఉందా? జాబు రావాలంటే బాబు రావాలి. చెత్త పన్ను రద్దు చేస్తాం.

నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా బాగు చేస్తాం
ఆకువీడును అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థపై స్లాబ్ లు వేయిస్తాం. రైల్వే లైన్ పై ఫ్రైఓవర్, అండర్ బ్రిడ్జ్ కడతాం. పరిశ్రమైన పట్టణంగా ఆకువీడును తయారు చేస్తాం. ఆక్వాకల్చర్ పడకేసింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు రూ.1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఏరియేటర్లు సబ్సిడీపై ఇస్తాం. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లన్ని వేయిస్తాం. రాష్ట్రానికి సైకో నుంచి విముక్తి కలగాలని ప్రత్యేకంగా ఉండి నుంచి సందేశం ఇచ్చేందుకు వచ్చాను. ఓటుకు రూ.5వేలు, రూ.10వేలు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధపడింది. ఆ పాపిస్టి డబ్బు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. ఫ్యాన్ కి ఓటేస్తే మెడకు ఉరేసుకున్నట్టే.

LEAVE A RESPONSE