Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ విగ్రహల పరిస్థితి ఏమిటో ఆలోచించండి

– దాడులు చేసేవారిని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహిస్తున్నారని జివి ఆరోపణ

వినుకొండ:- రాష్ట్రంలో ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని ఓర్చుకోలేక యన్ టి ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, శిలాఫలకాలు ధ్వంసం చేయించడం, ప్లెక్సి లు చించి వేయించడం లాంటి అరాచకాలను వైసిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మాజీ శాసనసభ్యులు జివి.ఆంజనేయులు ఆరోపించారు.

నిన్న పట్టపగలు మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండల కేంద్రంలో యన్ టి ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన పై నిరసన తెలపడానికి వెళుతున్న తనను అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దాడులకు పాల్పడేవారిని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సాహిస్తున్నారు ఆరోపించారు.

రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ విగ్రహల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని జివి.ఆంజనేయులు హితవు పలికారు. యన్ టి ఆర్ విగ్రహాల ధ్వంసాలపై సియం ప్రకటన విడుదల చేయాలని లేకపోతే బాధ్యత వహించాల్సి వస్తుందని విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు జివి.ఆంజనేయులు అన్నారు.

LEAVE A RESPONSE