Suryaa.co.in

Andhra Pradesh

సైకో జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం!

ఎస్సీ కమిషన్ చైర్మనే బాధితుడైతే దళితులకు రక్షణ ఎక్కడ?!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగుగంటలపాటు చిత్రహింసల పాల్జేయడమేగాక… దాహంవేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారు.

ముఖ్యమంత్రి జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం… జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట.

LEAVE A RESPONSE