జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలకు పాల్పడగా, దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత విమానయాన సంస్థల కోసం తన గగనత లాన్ని మూసివేసింది.
అయితే పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తున్నప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయో గించలేదు. పాకిస్తాన్ గగనతలం మూసివేయ బడినప్పుడు భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయో తెలుసుకుందాం.
సాధారణంగా ఒక భారత విమానం సౌదీ అరేబి యాకు బయలుదేరితే పాకిస్తాన్ మార్గం ద్వారా త్వరగా చేరుకుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం మూసివేయబడ డంతో భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది కావచ్చు.
రెండవ ఎంపికగా భారత విమానాలు ముంబై నుండి అరేబియా సముద్రం గుండా సౌదీ అరేబియాకు చేరుకుంటాయి.ఒక భారత విమానం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుండి ఢిల్లీకి బయలుదేరితే అది పాకిస్తాన్ మార్గం గుండా వెళ్లకుండా ఇరాన్ గుండా అరేబియా సముద్రం ద్వారా ఢిల్లీకి చేరాల్సి ఉంటుంది.
దీనివల్ల విమానయాన సంస్థల ఖర్చులు పెరుగుతాయి. విమానాల సమయం కూడా పెరుగుతుంది. అలాగే భారత్ నుండి యూరప్కు వెళ్లే విమానాల దూరం 913 కిలోమీటర్లు పెరిగి, సమయం కూడా రెండు గంటలు అధికమవుతుంది. 2019 పుల్వామా దాడి సమయంలో కూడా భారత్ పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం మానే సింది. అయితే, తర్వాత రెండు దేశాల మధ్య గగనతలంలో రాకపోకలు పునఃప్రారం భమయ్యాయి. ఈసారి కూడా అదే జరిగింది.
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గగనతలాన్ని మూసివేయ డానికి ముందే ప్రధాన మంత్రి మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తున్నప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించ లేదు. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.