Suryaa.co.in

National

మే 1 నుంచి 4 బ్యాంక్ ల విలీనం

అమరావతి: కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏపీజీబీ, ఏపీజీవీబీ, సిజిజిబి, ఎస్‌జిబి విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద పనిచేస్తాయి. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించారు.

LEAVE A RESPONSE