తిరుపతి, జూలై 28: ఈ నెల 29 న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నందు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం నుండి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, మైనింగ్ , విద్యుత్ శాఖా మాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి , రాష్ట్ర అటవీ దళాల అధిపతి వై.మధుసూధన్ రెడ్డి , ఐ.ఎఫ్.ఎస్. లు ముఖ్య అతిధిలుగా హాజరు కానున్నారని, ప్రతి ఏటా జూలై 29 వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ఆనవాతీగా వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో పులుల ప్రాముఖ్యత ను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పులుల సంతతిని పెంచడానికి, వాటి సంరక్షణ కు రాష్ట్ర అటవీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. అటవీ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి చొరవతో రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి జూ పార్క్ లో ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…