Suryaa.co.in

Andhra Pradesh

పింఛన్ల పంపిణీ ఆపిందని సాక్షిలో విష ప్రచారం సిగ్గుచేటు

జగన్ రెడ్డి రాక్షస క్రీడకు వృద్దులు, వికలాంగులు,వితంతువులు బలి
జవహర్ రెడ్డి.. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించొద్దు
జగన్ ఉండేది మరో నలబై రోజులే
కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు ఖజానా దోచిపెట్టి జగన్ రెడ్డి డ్రామాలు
సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ పింఛన్లు పంపిణీ ఎందుకు చేయరు?
ఇంటి వద్దకే వెళ్లి పించన్ ఇచ్చే వరకు ఎన్డీయే కూటమి జగన్ రెడ్డిని వదలి పెట్టదు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

 

పింఛన్ల పంపిణీపై జగన్ రెడ్డి రాక్షస క్రీడకు తన తల్లి, తండ్రి వయసున్న వృద్దులు బలవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఈసీ ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఆపిందని సాక్షిలో విష ప్రచారం చేయటం సిగ్గుచేటు.

జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్దం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అందుకే ఈసీ వాలంటీర్ వ్యవస్ధను పక్కనపెట్టింది. ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వొద్దని ఈసీ చెప్పలేదు కదా? సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో మరి ఇంటింటికి ఫించన్ ఎందుకివ్వరు? మీ రాజకీయ లబ్ది కోసం మండుటెండల్లో వృద్దులు, వికలాంగులు సచివాలయాల దగ్గరకు వెళ్లాలా? వడదెబ్బ తగిలి వృద్దులు ప్రాణాలు కోల్పోతే జగన్ రెడ్డి బాధ్యత వహిస్తారా?

మరో 40 రోజుల పాటు జగన్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, లబ్దిదారులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఎందుకివ్వటం లేదు? ఇంటింటికి పింఛన్లు పంచటం కుదరదని సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి చెబుతున్నారు. అసలు ఆయనకేం సంబందం? లేపాక్షి కుంభకోణంలో తన సహనిందితుడైన మురళీధర్ రెడ్డిని తెచ్చి జగన్ సెర్ప్ సీఈవోగా పెట్టారు. అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్టు ఆడుతున్నారు. సచివాలయ సిబ్బందితో పాటు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్వోలున్నారు. వారితో పింఛన్లు అందించకుండా కేవలం రాజకీయకక్షతో జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారు. దీనిలో సమిధలు వృద్దులు, వికలాంగులు, వితంతువులు.

వృద్దులకు ఇంటి వద్దనే ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. అదే విధంగా పింఛన్ కూడా ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాస్తాం. జగన్ రెడ్డి అధికారులను బెదిరిస్తున్నారు, దీనిపై ఈసీ దృష్టి పెట్టాలి. జగన్ చెప్పినట్టు ఆడుతూ వృద్దులు, వికలాంగులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్న మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. జగన్ రెడ్డి కమీషన్ల కోసం కక్కుర్తిపడి రూ. 1300 కోట్లు తన వారికి కాంట్రాక్టు బిల్లులు చెల్లించారు. ఖజానాలో పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేవు. అందుకే జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారు.

నేడు రూ. 4 వేల కోట్ల అప్పు వస్తుంది, దాన్ని రేపు సచివాలయాల్లో ఫించన్లు ఇస్తారంట. జగన్ రెడ్డి ధనదాహానికి వృద్దులు, వికలాంగులు అల్లాడిపోతున్నారు. వృద్దుల ఉసురు జగన్ రెడ్డికి తగలకపోదు. జగన్ రెడ్డి తల్లిని తరిమేశాడు, సొంత బాబాయిని చంపిని వాళ్లకు కొమ్ము కాస్తున్నారు. సొంత చెల్లిని దుర్బాషలాడుతున్నారు. చీఫ్ సెకట్రరీ జవహర్ రెడ్డి ఎన్నికల నిభంధనలకు విరుద్దంగా వ్యవహరించొద్దు.

జగన్ ఉండేది మరో నలబై రోజులే, తర్వాత అధికారులు ఇబ్బందులు పడతారని ఉమామహేశ్వరరావు అన్నారు. ఫించన్లు ఇళ్ల వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు. గతంలో మాదిరి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇచ్చే వరకు ఎన్డీయే కూటమి జగన్ రెడ్డిని వదలి పెట్టదని ఆయన హెచ్చరించారు.

LEAVE A RESPONSE