Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఒంటరిగా కాదు శవాలతో వస్తున్నాడు

వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన
ముస్లింలకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే
పవన్ సినిమాల్లో పారితోషకం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు
ఆడబిడ్డలకు అండగా ఉండేది తెలుగుదేశమే
యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి?
రోగి రమేష్ ని పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపాలి
ఉయ్యూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఉయ్యూరు: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారు. పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని, సామాజిక ఉద్యమకారుల్ని ఈ సైకో బారి నుంచి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపా.

ఈ సైకో నన్ను కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. నేను జైలు నుంచి విడుదలై రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టిందంటే అది మీరు నాపై చూపించిన అభిమానం, దీన్ని నాజీవితంలో ఎప్పుడూ మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మీ కోసం పనిచేస్తా..మరొక జన్న ఉంటే మళ్లీ తెలుగు గడ్డపై పుట్టి తెలుగు జాతికి సేవ చేస్తాం. అదే నా ఆశయం. ఆడబిడ్డలు నేను ఎక్కడికెళ్లినా ఎనలేని అభిమానం చూపుతున్నారు, దారంతా మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఏ నాయకుడైనా శాశ్వతం కాదు,వారు చేసిన పనులే శాశ్వతం.

ముస్లింలకు న్యాయం చేసింది, చేసేది టీడీపీనే
మనకు కులాలు, మతాలు ముఖ్యం కాదు. రెండు సార్లు ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నాం. ఏ నాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో ఉర్దూను రెండవ భాషగా ఏర్పాటు చేశాం. ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశాం, హైదరాబాద్, కడపలో హజ్ హౌస్ లు కట్టాం. రంజాన్ తోఫా, దుల్హన్ సంక్షేమ పధకాలు అమలు చేశాం. ఇమామ్, మౌజమ్ లకు వేతనాలిచ్చాం. 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులో ఉంటే లాయర్లను పెట్టి కాపాడాం. నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని జగన్ అంటున్నారు.

ఆయన ఐదేళ్లు ఎక్కడికి వెళ్లారు. ముస్లింలపై దాడులు జరుగుతుంటే ఏనాడైనా నోరెత్తాడా? నంద్యాలలో రంజాన్ మాసంలో నమాజ్ చేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముస్లిం ఆడబిడ్డను వైసీపీ నేత కండకావరంతో బురఖా ఎత్తి చూశాడు. దీన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యుల్ని కండకావరంతో చెప్పుతో కొట్టాడు. వైసీపీ నేతలకు ఎంత కండకావరం? నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడితే జగన్ ఏమయ్యాడు?

పవన్ పారితోషకం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు
సైకో పాలన పోతేనే మన పిల్లలకు మంచి భవిష్యత్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తుకు 3 పార్టీల్ని ఒప్పించాడు. హీరోగా పారితోషికం వదులుకుని రాష్ట్రం కోసం పవన్ ముందుకొచ్చారు. అతన్ని వైసీపీ నేతలు అవమానించి మాట్లాడతారా? పవన్ పర్యటనలను అడ్డుకుంటారా? పవన్ అభిమానులు తలచుకుంటే జగన్ పరిస్ధితి ఏంటి? నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు నేను తలుచుకుంటే జగన్ అడుగు బయటపెట్టేవాడా? నిన్నటి వరకు ఆకాశంలో తిరిగిన జగన్ నేడు ఎన్నికలొచ్చాక బయటకొచ్చాడు. ఆకాశంలో తిరుగుతుంటే కింద చెట్లు కొట్టేస్తున్నారు. కర్యూ విధిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం. జగన్ వస్తే ముందు గొడ్డలి వస్తుంది, తర్వాత జగన్ వస్తారు. ఫ్యాన్ తిరగడం మానేసింది, వైసీపీ ఎన్నికల గుర్తుగా జగన్ గొడ్డలి గుర్తును పెట్టుకోవాలి.

జగన్ ఒంటిరిగా కాదు శవాలతో వస్తున్నాడు
నేను ఒంటరిగా వస్తున్నానని జగన్ అంటున్నారు, కాదు శవాలతో వస్తున్నాడు. 2014లో తండ్రి లేడన్నాడు, 2019 లో బాబాయి లేడన్నాడు, బాబాయిపై గొడ్డలి వేటిసింది ఎవరు? ఇప్పుడు ఫించన్లు ఇవ్వలేక వృద్దులను చంపేసి వాళ్ల శవాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ మంత్రి జోగి రమేష్ శవరాజకీయాలు చేస్తున్నాడు. అతన్ని రాజకీయం ఏంటో చూస్తా..ఇతన్ని పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపాలి. జగన్ వద్ద ఎవరూ ఉండలేరు, అమరావతి, పోలవరం ఆగిపోయాయి, వైసీపీలో ఉంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని బాలశౌరి సీటిస్తానన్నా…వైసీపీకి రాజీనామా చేశారు.

పార్ధసారధి అలానే టీడీపీలో చేరారు. వైసీపీలో మంచి వాళ్లకు చోటు లేదు. అందులో ఉంది బూతుల మంత్రి, గన్నవరం వంశీ, పేర్ని నాని వీళ్లు నాయకులా? వీళ్లకు మీరు ఓటు వేయాలా? ఊర్లు ఊర్లు ఏకమై వీళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. జగన్ ని కూడా మీ గ్రామాల్లోకి రానివ్వొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలి. దుర్మార్గుడి చేతిలో పావులుగా మారొద్దు, రాష్ట్రం కోసం ఎన్డీయే కూటమి పొత్తు. జగన్ రూ. 13 లక్షల కోట్ల అప్పు చేశాడు, కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాభివృద్ది సాధ్యమా? అందుకే దూరదృష్టితో ఆలోచించి పొత్తు పెట్టుకున్నా…ఆశీర్వదించండి.

వీధిలైట్లు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా?
తెలుగు జాతికి ఐటి ఫలితాలు అందించా. అందువల్లే నేడు ఎంతోమంది విదేశాల్లో స్ధిరపడ్డారు. వీధిలైట్లు వేయలేని జగన్ మూడు రాజధానులు కడతాడంట. పై రాష్ట్రాల్లో రిజర్వాయర్లు కడితే మనకు నీళ్లు రావు. అందుకే పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించాం. పట్టిసీమ పూర్తి చేసి ఏడాదిలో నీరిచ్చిన పార్టీ టీడీపీ. నేను ఒక్క సారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదు, జగన్ 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. .

రోగి రమేష్ ని పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపించాలి
ఇక్కడ జోరీగ రోగి..రమేష్ వచ్చాడు. మీ భూములు జాగ్రత్త. భూ రక్షణ చట్టం తెచ్చారు, అధి మీ భూమి మీపేరు మీద ఉందో లేదో మీకు తెలీదు. ఆ నెంబర్లు మార్చి మీ భూములు కొట్టేస్తారు. తమ 4 ఎకరాల భూమిని కబ్జా చేస్తే కడప జిల్లా ఒంటిమిట్టలో చేనేత కుటుంబం విష తాగి ఆత్మహత్యలకు పాల్పడింది. జోగి రమేష్ కాదు రోగ్ రమేష్… ఆయన రౌడీలను పెట్టుకుని నా ఇంటిపైకి దాడికొస్తే…అతన్ని వదిలేసి పోలీసులు మా వాళ్లపై కేసులు పెడతారా? జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న నాపైనే దాడికి వస్తే..మీ పరిస్ధితి ఏంటి?

పెడన మొత్తం ఊడ్చేశాడు. మల్లంపూడి వంతెన నిర్మాణం కోసం రైతుల నుంచి రూ. 40 లక్షల డిమాండ్ చేశాడు. కృత్తివెన్నులో 80 ఎకరాలు బీఫాం భూముల్ని తక్కువ రేటుకి కొనుగోలు చేసి బినామీలతో చెరువులు తవ్వించారు. సెంటు పట్టాలో పేదల దగ్గర సెంటుకు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షల వసూలు చేశారు. ఇవన్నీ భరించలేక అక్కడ ప్రజలు చీకొట్టారు. ఇక్కడ కూడా మీరు అతన్ని ఓడించి తిరుగు టపాలో పంపాలి. అలాంటి రోగికి మెడిసిన్ బోడె ప్రసాద్. ఐవీఆర్ ఎస్ తో మీ అభిప్రాయం తీసుకుని బోడెకి టికెట్ ఇచ్చా….ప్రజలతో ఉంటే వారికే నేను అండగా ఉంటా.

LEAVE A RESPONSE