పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న జగన్ రెడ్డి

– మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

సీబీఐ విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులు చెప్పి పారిపోతున్న అవినాష్ రెడ్డి బాగోతాన్ని కవర్ చేస్తున్న ఏబీఎన్ ప్రతినిధులపై వైసీపీ రౌడీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిలపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్చను హరిస్తూనే ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న పత్రికలపై జగన్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలి.

Leave a Reply