Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీని డేరా బాబా డెన్‌లా తయారు చేస్తున్న జగన్ రెడ్డి

• టీటీడీ బోర్డులోని కళంకితుల్ని ముఖ్యమంత్రి తక్షణమే తొలగించాలి
• హిందూమతంపై, కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై ముఖ్యమంత్రికి ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేవు అనడానికి ఆయన విధానాలు, అనుసరిస్తున్న పద్ధతే నిదర్శనం
• 93 ఏళ్ల నుంచి పవిత్రంగా ఉన్న టీటీడీబోర్డులో కేసులున్న వారిని నియమించడం ఏమిటి?
• స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడి రిజిస్టర్లో ఎందుకు సంతకం పెట్టడంలేదో, సతీసమేతంగా పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించడం లేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి
• వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి, తాను హిందువునని చెప్పగల దమ్ము, ధైర్యం భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్నాయా?
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరామ్ ప్రసాద్

హిందూమతంపై, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం లేదు అనడానికి నాలుగేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఘటనలే నిదర్శనమని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిపై, లేదా ఆయన నమ్మే ఏదైనా పవిత్ర మత గ్రంథంపై ప్రమాణం చేసి, తాను హిందువునని చెప్పగల దమ్ము, ధైర్యం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్నాయా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ సవాల్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ తాను అనుసరించే మతమేదో చెప్పకుండా, తాను గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు అవిచేశాను… ఇవిచేశానని దాటవేత ధోరణితో కరుణాకర్ రెడ్డి తప్పించు కునే ప్రయత్నం చేస్తున్నాడు. శేషాద్రి కొండల ప్రాశస్త్యం, గొప్పతనం తెలుసుకోకుండా కరుణాకర్ రెడ్డి వాటిని బోడికొండలని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శేషాచలంపై మునులు, దేవతలు నడయాడి, సాక్షాత్తూ ఆ వేంకటేశ్వరస్వామిని పూజించారని ప్రతీతి. స్వయంగా కలియుగ పరంధాముడే ఆ కొండలపై తిరుగాడారని చెప్పుకుంటారు.
వృషభాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి అని ఏడుకొండలకు ఏడు పేర్లున్నాయి. ఒక్కో కొండకు ఒక్కో ప్రాశస్త్యం, ఒక్కో ఘన చరిత్ర ఉన్నాయి. అటువంటి ఏడు కొండలను గతంలో కరుణాకర్ రెడ్డి రెండుకొండలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజంకాదా?

టీటీడీ బోర్డులోని సభ్యులపై కేసులున్నది నిజంకాదా?
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సభ్యులుగా నియమితులైన వారికి నేరచరిత్ర ఉన్నది నిజంకాదా? వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై 16 కేసులు, తిప్పేస్వామి పై భూకబ్జా కేసులు, శరత్ చంద్రారెడ్డిపై లిక్కర్ స్కామ్ కేసులు, కేతన్ దేశాయ్ పై కేసులు ఉన్నది నిజంకాదా? టీటీడీ బోర్డు సభ్యుల ప్రయాణ ఖర్చులు బోర్డే భరించాలి. అందువల్లే గతంలో ఏప్రభుత్వం ఏపీ చుట్టుపక్కల రాష్ట్రాల వారిని తప్ప, ఇతర రాష్ట్రాల వారిని బోర్డు సభ్యులుగా నియమించలేదు. గతంలో టీటీడీ సభ్యులుగా ఉన్న 14 మందిపై కేసులు, నేరచరిత్ర ఉన్నాయి.

జగన్ రెడ్డికి హిందూమతంపై, వేంకటేశ్వరస్వామిపై భక్తిశ్రద్ధలు లేవు
జగన్మోహన్ రెడ్డి, వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ప్రతిసారీ అక్కడి రిజిస్టర్లో తాను హిందుమతాన్ని గౌరవిస్తానని, స్వామివారిపై భక్తిశ్రద్ధలు ఉన్నాయని ధృవీకరించు కుంటూ ఏనాడు ఎందుకు సంతకం పెట్టలేదు? సతీసమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు? నాలుగున్నరేళ్లలో ఏ హిందూదేవాలయానికి అయినా జగన్ రెడ్డి సతీసమేతంగా వెళ్లాడా? జగన్ రెడ్డికి హిందూమతంపై గౌరవం ఉందంటే ఎలా నమ్మాలి?

ముంబైకి చెందిన ఓ కంపెనీ రూ.300కోట్లతో పిల్లల ఆసుపత్రి నిర్మిస్తామంటే సదరు కంపెనీకి 10 ఎకరాలు కేటాయించి నిర్మాణం చేపట్టమన్నారు. రూ.2లక్షల మూలధనం కూడా లేని సదరుకంపెనీ రూ.300కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందంటే ఎలా నమ్మారు…ఎలా ఎంపికచేశారు? మేం క్షేత్రస్థాయిలో పరిశీలించి జరిగిన వ్యవహారంపై నిలదీయడంతో, సదరు కంపెనీని పక్కన పెట్టినట్టు టీటీడీ చెప్పింది. తరువాత టీటీడీనే స్వయంగా నిర్మిస్తుందని చెప్పి, ముఖ్యమంత్రితో ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేయించారు. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఆనాడు జరిగిన తప్పిదాలపై టీటీడీ ఎందుకు స్పందించడంలేదు.

తన కుమారుడు చనిపోయిన 11 రోజులకే టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి ఆలయా నికి వచ్చింది నిజంకాదా? హిందూ ధర్మానికి విరుద్ధంగా ధర్మారెడ్డి అలా చేయడం ఎం తవరకు సబబు? మైల ఉన్న ఇంటినుంచి రాకూడదని తెలిసినా, ధర్మారెడ్డి స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి పవిత్రతను, ఆలయ నియమనిష్టలను మంటగలిపారు. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?

ఇలాంటి ఘటనలు చూశాక హిందూమతం ప్రాశస్త్యాన్ని, పవిత్రతను మంటగలపడమే ధ్యేయమన్నట్టుగా టీటీడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీటీడీ చేసే తప్పులకు ముఖ్యమంత్రే బాధ్యులవుతారు. టీటీడీ బోర్డు 1930లో ఏర్పాటైంది. 93ఏళ్లుగా ఆ బోర్డు ఒక పద్ధతిప్రకారం, పవిత్రతతో పనిచేస్తోంది. కానీ జగన్ రెడ్డి ఏలుబడిలోనే సదరు బోర్డులో ఏనాడు జరగని అక్రమాలు, తప్పులు జరుగుతు న్నాయి. కొన్ని కోట్ల మంది హిందువులు, కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు మంటగలిపేలా వ్యవహరించకుండా, టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిం చిన కళంకితుల్ని జగన్ రెడ్డి తక్షణమే తొలగించాలి.” అని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE