Suryaa.co.in

Andhra Pradesh

రౌడీలు, దొంగలకు వత్తాసు పలుకుతున్న జగన్ రెడ్డి

– దళితులపై దాడులు చేసిన వారికి అండగా వైసీపీ అధినేత
– వంశీ పార్టీ మారక గన్నవరంలో కొరవడిన ప్రశాంతత
– రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

మంగళగిరి : గతంలో అధికారం కోసం బూటకపు ఓదార్పు యాత్ర చేసిన జగన్ రెడ్డి … ఈరోజు మరో బూటకపు జైలు యాత్ర నిర్వహించాడని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జైలుకు వెళ్లి వచ్చి మళ్లీ ఎప్పుడు జైలుకు వెళతాడో తెలియని పాత జైలు పక్షి కొత్త గా జైల్లో చేరిన మరో పక్షిని పలకరించడానికి వెళ్లిందని ఎద్దేవా చేశారు.

దౌర్జన్యం చేసిన వంశీ జైలు కెళితే ఏదో ప్రజల తరపున పోరాటం చేసిన వ్యక్తిలా అతన్ని పరామర్మించడం జగన్ కే సిగ్గు చేటన్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులను రాచి రాంపాన పెట్టారని, సుబ్రమణ్యంను చంపేసి డోల్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ బాధిత దళిత కుటుంబాలను ఒక్కసారిగా కూడా పలకరించని జగన్ రెడ్డి … రౌడీలు, దోపీడీ దొంగల కోసం మాత్రం జైలు యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. 2020 వరకు గన్నవరం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరులా ఉందన్నారు. ఎప్పుడైతే అక్కడి స్థానిక ఎమ్మెల్యే వంశీ వైసీపీ పంచన చేరడంతో ఆ పార్టీ అలవాట్లను అలవర్చుకొని రౌడీయిజం చేయడం ప్రారంభించాడన్నారు.

తమ పార్టీ ఆఫీసును తగుల బెట్టించాడని, కేసు పెట్టిన దళితుడ్ని కిడ్నాప్ చేసి కొట్టి అతన్ని నానా హింసలు పెట్టి తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించాడని అన్నారు. కాల్వలు, కొండలు, చెరువులు అన్నింటినీ మింగేసిన వంశీని మంచివాడని చెప్పడం ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే చెల్లిందన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే.. గత ఐదేళ్లలో తప్పుచేసిన వారందరూ శిక్ష అనుభవించక తప్పదన్నారు.

గన్నవరం లో వంశీ పార్టీ మారాక చేసిన అరాచకాలు చూసి ప్రజలు ఎందుకు ఓటు వేసామా అని బాధపడ్డారన్నారు. జగన్ అరాచకాలపై 8నెలలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, తమకు వచ్చే గ్రీవెన్స్ లు చూసైనా ఎన్ని పాపాలు చేశాడో గ్రహించి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE