అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్దాలు

-పుసుపు కుంకుమకు ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధికి బాబు ఇవ్వలేదు
-ఇళ్లుకట్టరు, పోలవరం ప్రాజెక్టుపనులు జాప్యం, రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు
-బిజెపికి అవకాశం ఇవ్వండి శరవేగంతో అభివృద్ధి చేస్తాం: సోము వీర్రాజు

అమరావాతి: ప్రజా పోరు పరమార్థాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు.రాజధానిలేని రాష్ట్రం గా మార్చిందెవరు, పోలవరం జాప్యానికి కారకులెవరు అనే ప్రశ్నలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంతో పాటు కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అభివ్రుద్ది విషయాలను తీసుకుని వెళ్లేవిధంగా బిజెపి ప్రజా పోరుద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు .రాష్ట్ర రాజధానిలో లాంఛనంగా ప్రజా పోరును బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు సోమువీర్రాజు ప్రారంభించారు. రెండు కుటుంబ పార్టీలను లక్ష్యంగా వాక్భాణాలను సోము సంధించారు .శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పోరు సభను ప్రారంభించారు.

ఈ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగాన్ని కొనసాగిస్తూ 26 జిల్లాల్లో ప్రజాపోరు సభలు ప్రారంభిస్తున్నాం. జిల్లాకు 50 చొప్పున సభలు నిర్వహిస్తాం.సీఎం అయ్యాక ప్రజల్లో జగన్ కనిపించడం లేదు ఒక్క సందర్భంలో కూడా సీఎం సెక్రటేరియట్ లో కనిపించలేదు.అసెంబ్లీ ని అబద్ధాల వాణిగా మార్చేసారు.

ఎన్టీఆర్ ని పడగొట్టి న చంద్రబాబు కూడా దేశభక్తుడేనా.. జగన్ దేశభక్తుడా..మల్లాది విష్ణు డైరెక్ట్ గా దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలి. నియోజకవర్గంలో మోదీ ఏమిచ్చాడో…వెలంపల్లి కి మా పార్టీ తరఫున నిలబడి గెలిచే దమ్ముందా…పసుపు కుంకాలకు 35వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు, కేపిటల్ కట్టలేదు, పోలవరం కూడా కట్టలేదు.జగన్ వచ్చి రాజధానిలో సొంత ఇల్లు కట్టుకుని తాజాగా మూడు రాజధానులు అంటాడు..

ఇసుక అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తక్కువ ధరకు దొరకదు.బంగారానికి లేని స్టాక్ పాయింట్లు ఇసుకకి ఎందుకు…ఇసుక, సిమెంటు రేట్లు పెరిగిపోయి నిర్మాణ రంగం కుదేలైంది.చంద్రబాబు ఇళ్ళకు కాకుండా పసుపు కుంకాలకు ఖర్చు పెట్టాడు.జగన్ ని నమ్మి డబ్బులిస్తే.. ఇంకా ఇళ్ళే పూర్తవలేదు‌. నిర్వాసితుల వివరాలివ్వకుండా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెపుతున్నాడు సీఎం జగన్ .

సీఎం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధాని మోదీ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు ఇచ్చారు…ప్రధాని అన్నీ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది. ఎయిమ్స్ ఆసుపత్రికి కరెంటు, నీళ్ళు ఇవ్వాలి.. ఇవ్వకపోతే సీఎం జగన్ ఇంటి ముందు కూచుంటాం.. అంటూ తీవ్ర స్వరంతో సోము వీర్రాజు మండిపడ్డారు.8వేల కోట్లతో విజయవాడ సందు సందునా రోడ్లు వేయిస్తున్నది మోదీ.మోదీ కి ఓట్లు వేయకపోయినా మనకు అన్నీ ఇస్తున్నాడు…వాజపేయి గారి కార్యక్రమాలను సీఎం జగన్ తనవని చెప్పుకుంటాడు. జగనన్న ఒడి, జగనన్న తడి, జగనన్న జడి… ఏంటండీ ఈ తడి, ఒడి, జడి…2024లో ఈ కుటుంబ పార్టీలు తరిమేస్తాం. బిజెపి కుటుంబ పార్టీ కాదు.

వాలంటిర్లను పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు .కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసుకుని జగనన్న ఒడి, జగనన్న తడి అంటున్నారు,జగన్ ఒక స్టిక్కర్ బాబు.2024లో రెండు కుటుంబ పార్టీలను రాష్ట్రంలో తరిమేస్తం . మల్లాది విష్ణు, వెల్లంపల్లి టివిల్లో డిబెట్లు కాదు దమ్ముంటే ధైర్యంగా మా దగ్గరికి రా…. ఏం అభివృద్ధి చేశామో చెప్తాం… వచ్చే దమ్ము వుందా .అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెబుతున్నాడు.పోలవరం నిర్వాసితుల సర్వే చేయలేదు…. సర్వే చేస్తే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నం. ఈ కార్యక్రమానికిబిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు జిల్లా బిజెపి అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం అధ్యక్షత వహించారు. అడ్డూరి శ్రీరాం, హరీష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్నకుమారి ఈ కార్యక్రమాన్ని నాగలింగం శివాజీ నిర్వహించారు.

Leave a Reply