Suryaa.co.in

Andhra Pradesh

క్రీడలకు జగన్మోహన్ రెడ్డి చీడ

– జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్రను ప్రవేశపెట్టారు
-క్రీడారంగమేకాక అన్ని రంగాల్లో అవినీతి చోటు చేసుకుంది
-ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు ముగిసి.. ఇక ఆడటానికి ఏ ఆటలు లేక ఆడుదాం ఆంధ్ర అంటున్నారు
-చంద్రబాబు ప్రోత్సాహంతో క్రీడారంగం విశ్వవ్యాప్తమైంది
-మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్రను ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఆడుదాం ఆంధ్రను ప్రవేశపెట్టారు. ఈ ఆడుదాం ఆంధ్ర తెర వెనుక ఏదో రహస్యం దాగివుంది. ఏదో ఆంతర్యం ఉంది. ఎవర్ని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగమో అర్థం కావడంలేదు.

నాలుగున్నర సంవత్సరాలుగా గుర్తుకురాని క్రీడలు ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చాయి? క్రీడలను ఏనాడైనా ప్రోత్సహించారా? క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ఎప్పుడైనా సహకరించారా? వాటి అభివృద్ధి కోసం కనీసం ఏనాడైనా ఉచ్ఛరించనైనా ఉచ్ఛరించారా? అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ఆటలపైన ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? క్రీడారంగంలో భాగమైన శాప్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. క్రీడాభివృద్ధికి ఏమీ చేయకపోగా రాజకీయ మరకలు అంటించారు. రక రకాల ఆటలు ఆడటం, రకరకాల మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ని చంపేసి ‘ఆడుదాం ఆంధ్ర’ అంటే ఎవరు నమ్మరు.

క్రీడారంగమేకాక అన్ని రంగాల్లో అవినీతి చోటు చేసుకుంది
క్రీడారంగమేకాక అన్ని రంగాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. క్రీడలకు చీడ పట్టించిన ఘనత జగన్ కే దక్కుతుంది. 11,162 క్రీడా క్లబ్బులకు జగన్ పేరు పెట్టుకొని రిజిస్ట్రేషన్లకి డబ్బులు లేక చేతులెత్తేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలకు ఎక్కడా మెయింటెనెన్స్ నిధులు ఇవ్వలేదు. ఎవర్ని ఏమార్చడానికి ఆడుదాం ఆంధ్ర అనే కొత్త ప్రయోగం?. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మరో మోసానికి తెరలేపారు. అవినీతి ఆట, క్యాసినో ఆట ఆడారు.

ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు ముగిసి.. ఇక ఆడటానికి ఏ ఆటలు లేక ఆడుదాం ఆంధ్ర అంటున్నారు
ఆఖరున ఆటలాడడానికి ఏమీలేక ఆడుదాం ఆంధ్ర అంటున్నారు. ప్రజల జీవితాలతో ఆడిన ఆటలు చాలవా?. ఆటలను ప్రోత్సహించడానికి సమయం ఇప్పుడు దొరికిందా?. సచివాలయ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఏవీ?. ప్రతిచోట క్రీడా క్లబ్ లను పెట్టి ప్రోత్సహిస్తానని చెప్పారు ఏదీ? యువత, బాల బాలికలు, విద్యార్థులతో ఆటలాడుకోవాలని చూడటం మంచిదికాదు. ఏ జిల్లాలోనైనా, మండలాలలోనైనా ఏ ప్రాంతంలోనైనా వారి శిక్షణ కోసం కృషి చేశారా? మైదనాలను బాగు చేశారా? ఉన్న మైదానాల్లో గడ్డి పీకడానికి నిధులివ్వలేని ప్రభుత్వం ఏం ఆడుతారు? శిక్షణ పొందిన క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా?

శాప్ రంగాన్ని రాజకీయాలకు నిలయంగా మార్చారు
శాప్ రంగం రకరకాల రాజకీయీలకు నిలయంగా మారింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కూడా రాజకీయం చోటు చేసుకుంది. మద్యం కేసులో నిందితుడైన విజయసాయిరెడ్డి అల్లుడిని ఛైర్మన్ గా చేయడమేంటి? ఒలంపిక్ ని తమ చేతుల్లో పెట్టుకొని ఆట ఆడించారు. క్రీడా రంగాన్నిఅన్యులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయం కోసం ఆడుదాం ఆంధ్ర అంటున్నారు.

ప్రజలు నమ్మరు. చిన్నపిల్లల అంగన్వాడీ సెంటర్లను మూసేశారు. తల్లి, పిల్లలకు పోషక ఆహారం అందించడంలేదు. 4,757 స్కూల్స్ మూతపడే పరిస్థితి నెలకొంది. పుట్టినరోజునాడు పిల్లలను మోసం చేయడానికి చింతపల్లె అడువుల్లోకి వెళ్లారు. పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలా? మోసం లబ్ది పొందలేరు, నాశనం, వినాశక చర్యలు ఏవరూ చేసి ఉండరు. అన్ని రకాలుగా వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారు. అవినీతికి పాల్పడ్డారు. క్రీడలకు చీడ పట్టించారు.

యువతకు ఉద్యోగాలిస్తామని మోసం చేశారు
యువతకు ఉద్యోగాలిస్తానని మోసం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ నాశనం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ఆపేశారు. స్కూల్ సాధించిన ఘనత? పూర్తిగా నిర్వీర్యం చేుశారు. గంజాయి కి బానిసలుగా మార్చారు. గతంలో చంద్రలబాబు ముఖ్యమంత్రి ఉమ్మడి.. 2014 ముఖ ప్రోత్సహించారు.

టీడీపీ హయాంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేశాం
టీడీపీ ప్రభుత్వం, శాప్, ఒలింపిక్, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృ ద్ధికి బాటలు వేశాయి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులను తయారుచేసి, రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.

మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు, 2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘన మైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ కి ఉంది.
చంద్రబాబు నాయుడు ఉప్పల్, గచ్చిబౌలి, సరూర్ నగర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్ క్రీడకు ప్రోత్సాహం అందించారు.

చంద్రబాబు ప్రోత్సాహంతో క్రీడారంగం విశ్వవ్యాప్తమైంది
చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీ చంద్, కోనేరు హంపి, పీవీ సింధు వంటి వారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పేరును విశ్వవ్యాప్తం చేశారు. చంద్రబాబు నాయుడు పుల్లెల గోపిచంద్ అకాడమికీ హైదారాబాద్ (2003) లో 5 ఎకరాలు, అమరావతి 2017 లో 12 ఎకరాలు కేటాయించారు.

కానీ నేడు జగన్ రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీర్వం చేసి కేవలం ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్రపేరుతో ఆడుతున్న డ్రామాను యువత గమనిస్తున్నారు. అందుకే జగన్ రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అంటూ నినదిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్దంగా ఉన్నారు. బైజూస్ ద్వారా మోసం చేశారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

LEAVE A RESPONSE