Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నిజాయితీపరుడని జగన్మోహన్ రెడ్డే రుజువు చేశాడు

– 53 రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారు
– స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా కోర్టుకు జగన్ సర్కార్ చూపలేకపోయింది
– పార్టీకోసం, నాయకుడికోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలను ఆదుకోవడం నా కర్తవ్యం

చిలకలూరిపేట : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం ఆధారాల్లేని ఓ కేసులో కుట్రపూరితంగా ఇరికించి 53రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించిందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళలను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు.

ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుగారిపై అక్రమ కేసు పెట్టిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమే.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చంద్రబాబుగారు పెద్దపెద్ద కంపెనీలను తీసుకొచ్చారు.యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుబట్టింది.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారని ఎలాంటి ఆధారాల్లేకుండా కేవలం ఆరోపణలతోనే చంద్రబాబు పై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు.

చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో జగన్ సర్కార్ ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు ఇవ్వలేకపోయింది…అంటే చంద్రబాబు నిజాయితీపరులని జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక, మనస్తాపానికి గురై పార్టీ బిడ్డలు మృతిచెందారు. వారి కుటుంబాలను పరామర్శించడం, వారిని ఓదార్చడం నా కర్తవ్యం.. నా కర్తవ్యాన్ని మర్చిపోకుండా నేడు పార్టీ బిడ్డల కుటుంబాలను కలిసి, పరామర్శిస్తున్నాను.

నాకు సంఘీభావం తెలిపేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున కదలివస్తున్న కార్యకర్తలు, మహిళలకు నా ధన్యవాదాలు. మా కుటుంబంపై రాష్ట్ర ప్రజలు, మహిళలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు.

ప్రత్తిపాడు నియోజకవర్గం లో…. టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, వింజనంపాడు గ్రామంలో కార్యకర్త నార్నె విజయలక్ష్మి కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 01-10-2023న మృతిచెందిన విజయలక్ష్మి.
• విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి
• విజయలక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన విజయలక్ష్మి కుటుంబ సభ్యులు.
• విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో కార్యకర్త జేష్టాటి కోటేశ్వరరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-10-2023న మృతిచెందిన కోటేశ్వరరావు.
• కోటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి
• కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• నరసరావుపేట నియోజకవర్గం, ములకలూరు గ్రామంలో కార్యకర్త షేక్ సైదా కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 14-09-2023న మృతిచెందిన సైదా.
• సైదా చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి
• సైదా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• సైదా కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE