Suryaa.co.in

Telangana

ఫోన్ టాపింగ్ కు పాల్పడిన వాళ్లకు జైలే గతి

-విన్నామని సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు
-కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారు
-దాని ఫలితం ఆయన అనుభవిస్తారు
-గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చాం
-వాల్మీకి బోయలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వాల్మీకి బోయల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత సంక్షేమంలో, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. వాల్మీకి బోయలు కాంగ్రెస్ కు అండగా నిలబడాలి. వంద రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించాం.

పరిపాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. వంద రోజులు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేసింది. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. పదేళ్ల బీఆరెస్ పాలనలో ప్రభుత్వంపై ఉద్యోగులు విశ్వాసం కోల్పోయారు.ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం. గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలన తీసుకొచ్చాం.

మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడేలా ఉండకూడదు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. కొద్ది మందివి విన్నామని సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇలా బరి తెగించి ఎవరైనా మాట్లాడుతారా? కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారు. దాని ఫలితం ఆయన అనుభవిస్తారు. ఫోన్ టాపింగ్ కు పాల్పడిన వాళ్లు చర్లపల్లి జైలులో ఊచలు లెక్కబెడతారు.

200 ఓట్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలవబోతున్నాం.బీజేపీ, బీఆరెస్ గూడు పుఠాని చేయకపోతే ఆలంపూర్, గద్వాల గెలిచే వాళ్లం. అధికార బీజేపీ లో ఉన్న డీకే అరుణ ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా? జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న అరుణమ్మ పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదు? బీజేపీ, బీఆరెస్ కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయి. ఏ ముఖం పెట్టుకుని మహబూబ్ నగర్ లో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారు.

LEAVE A RESPONSE