Suryaa.co.in

Andhra Pradesh

మనది విజన్.. జగన్ ది పాయిజన్

-రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
-కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారుచేస్తాం
-ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి
-ఈ పొత్తు మాకోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం
-ఏ మైనార్టీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది
-సంపద సృష్టించి పేదవారికి పంచాలనేది టీడీపీ ఆశయం
-గోదావరి నీటిని రాయలసీమకు తీసుకొస్తాం
-మూడు ముక్కలాటతో చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి
-జగన్ రెడ్డి మీటింగ్ లు వెలవెల, మా మీటింగ్ లు కళకళ
-వివేకాను చంపేశారు…చెల్లెల్ని జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారు
-నాశనం చేయడంలో జగన్ రెడ్డి దిట్ట
-కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని
-రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూటమిని గెలిపించాలి
-తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన రోజు ఇది
-బనగానపల్లె ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

బనగానపల్లె: తెలుగుదేశం పార్టీ జెండాను 42 ఏళ్లుగా మోస్తూనే ఉన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ గెలిపిస్తారనే నమ్మకం ఉంది. నా తమ్ముళ్లు అనుకంటే తెలుగుదేశం విజయం సునాయాసం. జనసైనికులు కూడా పెద్దఎత్తున వచ్చారు. నిరంతరం విజయం కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఎన్డీయేగా జట్టుకట్టాం. సామాజిక న్యాయం కోసం పోరాడే ఎమ్మార్పీఎస్ కూడా మనతో కలిశారు. అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసం. ఏం అనుమానం లేదు. ఇప్పటినుంచి అన్ స్టాపబుల్.

టీడీపీ ఆవిర్భవించి నేటికి 42 ఏళ్లు. ఒక మహనీయుడు శుభమూహూర్తాన పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగుజాతి ఆత్మగౌరవం చాటిచెప్పిన రోజు ఇది. తెలుగుజాతికి గుర్తింపు వచ్చిన రోజు ఇది. బడుగు, బలహీనవర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజు ఇది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజు ఇది. ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు వెళ్లాం. దేశంలోనే ప్రత్యేక స్థానం ఏర్పాటుచేసుకున్నాం. క్రీస్తుశకం ఏవిధంగా ఉందో, తెలుగుజాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాత అని తెలుగుజాతి గుర్తుకుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజు బనగానపల్లి రావడం నా అదృష్టం.

పేదవారికి, వృద్ధులకు రూ.30తో పెన్షన్ ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం
ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ పేదవారికి ఇవ్వాలని టీడీపీని ఏర్పాటుచేశారు. కేజీ రూ.2కే ఇచ్చిన ఘనత టీడీపీది. రైతులకు సాగునీటి కోసం అనేక సాగునీటి ప్రాజెక్టులు చేప్టటారు. కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచన చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. అన్ని వర్గాలకు సంక్షేమం అందించారు. పేదవారికి, వృద్ధులకు రూ.30తో పెన్షన్ ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాం. జాతీయస్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కింది.

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుచేశాం. ఎన్డీయేలో భాగస్వాములు అయ్యాం. సంపద సృష్టించి పేదవారికి పంచాలనేది మన ఆశయం. పేదరికం నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తోంది. జాతీయ రహదారులతో పాటు రోడ్లన్నీ బాగయ్యాయంటే టీడీపీదే ప్రధానపాత్ర. సెల్ ఫోన్లు వాడుతున్నారంటే టీడీపీ చూపించిన చొరవే కారణం. పవర్ సెక్టార్లలో సంస్కరణలు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం. అవుకులో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారంటే అవన్నీ రావడానికి, ఓర్వకల్లులో కూడా వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు వచ్చిందంటే టీడీపీ దూరదృష్టే కారణం. సంపద సృష్టించాం. 2020 విజన్ తో హైదరాబాద్ ను ప్రపంచంలోనే నెం.1 నిలబెట్టిన ఘనత టీడీపీదే.

మూడు ముక్కలాటతో మనకు చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి
రాష్ట్రవిభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి.సమస్యల నుంచి పరిష్కారం చూపించే బాధ్యత టీడీపీ తీసుకుంది. నదుల అనుసంధానం కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరంను 72శాతం పూర్తిచేశాం. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావాలనేది మా సంకల్పం. పెట్టుబడులు పెద్దఎత్తున తీసుకువచ్చాం. కియా పరిశ్రమను పేద జిల్లా అనంతపురానికి తీసుకువచ్చిన ఘనత టీడీపీది. అమరావతిపై నిన్న కూడా సైకో మాట్లాడుతున్నారు.

మూడు రాజధానులు చేశానని మాట్లాడుతున్నారు. కర్నూలు అభివృద్ధి అయిపోయిందా? మూడు ముక్కలాటతో మనకు చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద పేదవారికి పంచాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదవారికి అండగా ఉంటాం. భవిష్యత్ లో మీకోసమే పనిచేస్తా. విజయం సాధించేవరకు, పేదరికం లేని రాష్ట్రం చేసే వరకు మీకు అండగా టీడీపీ ఉంటుంది. 42వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెలుగువారు ప్రపంచంలోనే గుర్తింపు పొందాలనేది మా ఆశయం. ఇది జరుగుతుంది.

ఇచ్చేది పది, దోచేది వంద
జగన్ రెడ్డి పాలనలో అందరూ నష్టపోయారు. రైతులు బాగుపడలేదు, సబ్సీడీలు రావడం లేదు. గిట్టుబాటు ధర లేదు, పొలాలకు నీరు లేదు, మహిళలకు రక్షణ లేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. ఇచ్చేది పది, దోచేది వంద. ఫ్యాన్ ను చిత్తుచిత్తు చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. పెట్టుబడులు రాలేదు, యువతకు ఉద్యోగాలు రాలేదు. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్ మేం చూసుకుంటాం. కూలీలకు ఉపాధి లేదు, భవన నిర్మాణ కార్మికులకు పనిలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కార్పోరేషన్ నిధులు ఇవ్వలేదు, రూపాయి సబ్సీడీ ఇవ్వలేదు. ఏ ఒక్కరికి సాయం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా అందడం లేదు. పీఎఫ్ డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఈ రోజు రాయలసీమలో తాగునీరు కూడా లభించడం లేదు
ప్రజాగళం పేరుతో వచ్చా. సింహగర్జన, శంఖారావం చేయడానికి వచ్చా. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి వచ్చా. మీరు సిద్ధమా? తాగునీరు, సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. వారోనికోసారి స్నానం చేసే పరిస్థితి. ఈ రోజు నువ్వు కడక్కోవడానికి కూడా రాయలసీమలో నీరు లేదని జగన్ రెడ్డిని అడుగుతున్నా. మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగారు. చెట్లన్నీ కొట్టేశారు. పాఠశాలలు మూయించి కూలీ మనుషులను తీసుకెళ్లారు. నిన్న కూడా తీసుకెళ్లారు, అక్కడ నిలిచే పరిస్థితిలేదు. సాయంత్రం మీ మీటింగ్ లు వెలవెల, మీ యాత్ర తుస్సయ్యింది. మిట్టమధ్యాహ్నం మా మీటింగ్ లు విజయవంతం. మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమై వచ్చారు.

ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి
ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి. రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప జగన్ రెడ్డికి ఏమీ తెలియదు. బుగ్గరు నిమిరి, ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బడ్డన్నావు, చిన్నాన్నను చంపేశావు. చెల్లెల్ని జైలుకు పంపాలని చూస్తున్నారు. దోషులను పక్కనపెట్టుకుని తిరుగుతున్నారు. వారికే సీటు ఇచ్చి వారి ఆత్మను క్షోభపెట్టడం న్యాయమా? ఉమ్మడి కర్నూలుకు జగన్ చేసిందేమీ లేదు. ఎన్నికల ముందు బాబాయి గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామా ఆడారు.

ఇప్పుడు కంటైనర్ లో అవినీతి డబ్బులు. వంటసామాగ్రి కోసం, ఫర్నిచర్ కోసం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మద్యంలో దొంగిలించిన, ఇసుకలో బొక్కిన డబ్బులు, అడ్డంగా సంపాదించిన డబ్బులను పోలీసుల సహగారంతో కంటైనర్ లో పెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు. ఫుల్ గా తాగించి మభ్యపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. నంద్యాలలో మీటింగ్ పెట్టి 10 కోట్లు ఒక్క బస్సులకే ఖర్చుపెట్టారు. వచ్చిన డ్వాక్రా సంఘాలు ఒక్కరు కూడా బస్సులు దిగలేదు. పోలీసులు బతిమిలాడినా, కాళ్లు పట్టుకున్నా మేం వెళ్లిపోతామని రాష్ట్రం కోసం వీరమహిళలు వెనుతిరిగారు. మనం 7 మీటింగ్ లు పెట్టాం. ఎప్పుడు పెట్టినా యుద్ధానికి సిద్ధమని ప్రజలు చెబుతున్నారు. క్వార్టర్ బాటిల్ చూస్తే గుర్తుకువచ్చేది జగన్ రెడ్డి దోపిడీ. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ రూ.200 అయింది. రూ.140 తాడేపల్లి కొంపకు పోతున్నాయి. జనం రక్తం తాగే జలగ జగన్ రెడ్డి. ప్రజల ఆరోగ్యం పాడుచేశారు.

మనది విజన్, జగన్ ది పాయిజన్
ఈ జిల్లాలో నేను అభివృద్ధికి నాంది పలికారు. 365 కోట్లతో సాగునీటి ప్రాజెక్టును తీసుకువస్తే అదీ పోయింది. నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాకర్టీని తీసుకువస్తే అదీ పోయింది. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ పెడితే రద్దు చేశారు. మనది విజన్, జగన్ ది పాయిజన్. నాశనం చేయడంలో దిట్ట. కర్నూలు, ఓర్వకల్లులో 90 కోట్లతో విమానాశ్రయం కట్టాం. జగన్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు. నువ్వు కట్టలేవు, ఎవరో కట్టినదానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు మీ ముఖానికి వేసుకోవాలి రంగు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటుచేద్దామనుకున్నాం. 6 వేల కోట్లతో సోలార్ పార్క్ లు ఏర్పాటుచేసి 5వేల మందికి ఉద్యోగాలు కల్పించాం.

నేనూ రాయలసీమ బిడ్డనే
1,800 కోట్లతో బనగానపల్లిలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్థన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఓటేయకుండా దొంగకు ఓటేశారు. నీరు, విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ద్వారా రాయలసీమ దశ, దిశ మారుతుందని నేను సంకల్పించాం. 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. నేనూ రాయలసీమ బిడ్డనే. పిల్లకాకి అడుగుతున్నాడు నేను ఏం చేశానని. నా వయసు అడుగుతున్నాడు. నాలాగ మధ్యాహ్నం రెండు మీటింగ్ లు పెడితే తెలుస్తుంది? ఎక్కడ చూసినా నా ముద్ర కనిపిస్తుంది. నన్ను అడిగే అర్హత లేదు.

హైదరాబాద్ ఎవరు కట్టారంటే, అవుటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఐటీ ఉద్యోగాలు అంటే ఎవరు పేరు చెబుతారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరు పేరు చెబుతారు? నీ పేరు చెబితే ఏం గుర్తుకువస్తాయో చెప్పాలి. నన్ను, బాలకృష్ణ, కేశవ్ నే గెలిపించారు రాయలసీమలో. 102 సాగునీటి ప్రాజెక్టులు రద్దు చేశారు. నేను 12వేల కోట్లు రాయలసీమలో ఖర్చుపెట్టాను. ప్రాజెక్టులు పరుగులు పెట్టించాను. జగన్ రెడ్డి ముష్టి 2వేల కోట్ల ఖర్చుపెట్టావు. సాక్షికి ఇచ్చిన ప్రకటనలు అంతా ఆ ఖర్చు. మీకు కులం, మతం కావాలా, మీ భవిష్యత్ అవసరం లేదా? ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. జాబు రావాలంటే బాబు రావాలి.

జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి
కియా మన బ్రాండ్, జాకీ పరిశ్రమ పారిపోవడం జగన్ బ్రాండ్. మీ భవిష్యత్ నాది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని 90శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తే జగన్ రద్దు చేశాడు. పది లక్షల ఎకరాలకు డ్రిప్ ఇస్తే రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. కోనసీమ కంటే మిన్నగా రాయలసీమను తయారుచేస్తాం. రాయలసీమలో ముచ్చుమర్రి పూర్తిచేశాం. సిద్ధాపురం, పులకుర్తి, గోర్వకల్లు రిజర్వాయర్, పులికనుమ, అవుకు టన్నెల్ పూర్తిచేశాం. రాయలసీమ ఆప్తులు ఎవరు, ద్రోహులు ఎవరు. జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి.

అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది
మాదిగలకు ఏబీసీడీ కేటగిరీ నేనే పెట్టా. ఎన్డీయే కూడా ఒప్పుకుంది. మళ్లీ మాదిగలకు, అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. జగన్ రెడ్డి అప్పులతో రాష్ట్రం అధోగతిపాలైంది. ఆడబిడ్డ సంక్షేమ నిధి ఏర్పాటుచేస్తాం. 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 ఇస్తాం. ముగ్గురుంటే 4500 వస్తాయి. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. డ్వాక్రా సంఘాలు, ఆస్తిలో సమానహక్కు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టాం. మహిళలను శక్తిమంతం చేస్తాం. తల్లికి వందనం పేరుతో స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే 45వేలు వస్తాయి.

ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. యువతకు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. గతంలో నేను 9 డీఎస్సీలు పెట్టాం. ఎన్టీఆర్ 3 పెట్టారు. మొత్తం 12 డీఎస్సీలు నిర్వహించాం. జగన్ ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. వర్క్ ఫమ్ హోం తీసుకువస్తాం. మండల కేంద్రంలో వర్క్ స్టేషన్లు కడతాం. అన్నదాతలకు ఏడాదికి రూ.20వేల సాయం చేస్తాం. డ్రిప్ ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం.

పెన్షన్ ను రూ.200 నుంచి 2వేలు చేసింది నేను. దీనిపైనా అబద్ధాలే. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫస్ట్ తేదీన మీ ఇంటికే రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం, రెండో నెల తీసుకోకపోతే 3నెల ఇస్తాం. వాలంటీర్ల వ్యవస్తను తీసేయను. ద్రోహులకు పనిచేయవద్దని చెబుతున్నా. ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ. వాలంటీర్లు చదువుకుని ఉంటే 5వేలు కాదు.. జీతాలు పెంచే విధంగా చేస్తాం. చదువుకున్న వ్యక్తులకు స్కిల్ డెవలప్ మెంట్ చేసి రూ.50వేలు సంపాదించేలా చేస్తా.

సైకో పోవాలి- రాష్ట్రం నిలబడాలి
రాష్ట్రంపై 12 లక్షల కోట్ల అప్పు ఉంది. వ్యవస్థలు చిన్నాభిన్నం చేశారు. జనార్థన్ రెడ్డి లాంటి సౌమ్యుడిపై అక్రమ కేసులు పెట్టారు. అనేక మందిని జైలుకు పంపారు. నాకు కూడా తప్పలేదు. తప్పుడు కేసులు పెట్టిన వారికి చక్రవడ్డీతో సహా తీరుస్తాం. సైకో పోవాలి- రాష్ట్రం నిలబడాలి. అందుకే కలిసొచ్చే పవన్ తో పొత్తు పెట్టుకున్నాం. వ్యతిరేక ఓటు చీలకూడదు. బీజేపీతో కూడా కలిసి కలయిక ఏర్పాటుచేశాం. ఈ పొత్తు మాకోసం కాదు.. భావితరాల భవిష్యత్ కోసం. కేంద్రంలో ఎన్డీయే వస్తుంది.

మొదటి ఎన్డీయేలో నేను ఉన్నా. 2014-19 మధ్య ఎన్డీయేలో ఉన్నా. ఏ ఒక్క మైనార్టీకైనా అన్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా. అభివృద్ధి, సంక్షేమం చేశాం. ఉర్దూ రెండో భాషగా చేశా. హజ్ హౌస్ కట్టా. ఫైనాన్స్ కార్పోరేషన్ పెట్టా. రంజాన్ తోఫా, షాదీ ఖానాలు, మసీదులకు నిధులు, మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. ఆడబిడ్డల పెళ్లిళ్లకు నిధులు ఇచ్చాం. విదేశీ విద్య కోసం 15 లక్షల ఆర్థికసాయం చేశాం. మతసామరస్యం కాపాడిన పార్టీ తెలుగుదేశం. ఏ మైనార్టీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది, మాది. ఏ మతానికి, కులానికి అన్యాయం జరగదు. తెలుగుడ్డపై పుట్టినవారందరూ తెలుగువారే. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సైకోను ఇంటికి పంపించాలి.

కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని
కాటసాని రామిరెడ్డి బనగానపల్లెకు పట్టిన శని. మైనింగ్ యజమానులకు లీజు ఇవ్వాలన్నా, రాయల్టీ విషయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీలను బినామీలుగా పెట్టుకుని ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను మింగేసిన అనకొండ కాటసాని. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి కమీషన్లు, నాటుసారా వ్యాపారంలో దిట్ట. బనగానపల్లెలో బొలేరా బ్యాచ్ సెటిల్ మెంట్లు, రౌడీ బ్యాచ్. అజాత శత్రువు బీసీ జనార్థన్ రెడ్డికే కోపం వస్తే విపత్తు జరగబోతోంది.

ఈ విపత్తులో వైసీపీ భస్మం అవుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా జనార్థన్ రెడ్డి ప్రజల కోసం పోరాడుతున్నారు. బనగానపల్లె పట్టణంలో పేదలకు 2 సెంట్లు ఇస్తాం, నాపరాయి పరిశ్రమకు గత టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన విధానాలు అమలుచేస్తాం. రింగ్ రోడ్డులో రివర్స్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రింగ్ రోడ్డు పనులు పూర్తిచేస్తాం, కోయలకుంట్లలో బైపాస్ రోడ్డు మంజూరుచేస్తాం, బనగానపల్లెలో ఇంజనీరింగ్ కాలేజీ, స్కిల్ డెవలప్ సెంటర్, మైనార్టీ మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలు, ఆటో నగర్ ఏర్పాటుచేస్తాం.

బనగానపల్లె, కోయలకుంట్లలో పెండింగ్ లో ఉన్న షాదీఖానాలు పూర్తిచేస్తాం. లైమ్ స్టోన్ ఇష్టారాజ్యంగా తవ్వకుండా చూస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడ పెట్టేవారికే లీజుకు ఇస్తాం, యవతకు ఉద్యోగాలు ఇస్తాం. ఎండలో కూడా ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సంఘటనను మర్చిపోలేను. ప్రజల జీవితాలను నాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. టీడీపీ బలపర్చిన ఇద్దరు వ్యక్తులను గెలిపించాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే నా ధ్యేయం’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE