శ్రీ రెడ్డి ఒళ్ళమ్ముకుంటే…రోజా నోరమ్ముకుంటోంది

– రోజా విమర్శలకు , ప్రతి విమర్శలుగా జనసేన వీర మహిళల కౌంటర్

తిరుపతి: జండా , అజెండా , గెలుపోట ముల… గురించి పర్యాటక శాఖ మంత్రి రోజా జనసేన పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడిన… విమర్శలకు ప్రతి విమర్శలుగా…. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకే పాటి సుభాషిని, జిల్లా కార్యదర్శి కీర్తన, పట్టణ కార్యదర్శి లక్ష్మి, దివ్య తదితరులు నిప్పులు చెరిగారు.

బుధవారం మీడియా ముందు వీర మహిళలు మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గం తలకోన , బాకరపేట ప్రాంతాలను పర్యాటక శాఖ మంత్రిగా డెవలప్ చేయాల్సింది…. పోయి జగనన్న చేస్తున్న తప్పులను ,
ప్రభుత్వ పనితీరు పట్ల , తమ జనసేనాని ప్రశ్నిస్తే .. తగుదునమ్మ అని జనసేనను విమర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు… దమ్ముంటే ఈ గురువారం ఉదయం 11 గంటలకు నగిరి లోని రోజా ఇంటికి రావడానికి.. జన సేన సిద్ధంగా ఉందని … రోజా సిద్ధమా అని … ఇంటి దగ్గరే ఉండాలని , సవాల్ విసిరారు.

గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజా గెలుపోవటం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. టిడిపిలో ఉండి , వైఎస్సార్ ని బూతులు మాట్లాడిందని, నేడు అదే వైయస్సార్ వారసుడు జగన్ చెంత చేరి.. వైసీపీకి భజన చేస్తున్నదని.. విమర్శలు చేశారు.. 2024 లో జనసేన పార్టీ ప్రభుత్వ రానున్నదని హెచ్చరించారు, చేతనైతే నిన్న మా నాయకులు జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగలరా అని అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply