Suryaa.co.in

Andhra Pradesh

జనంతో మమేకమవుతూ.. జనం మధ్యకు జనసేనాని

  • దుర్గాడలో పవన్ కళ్యాణ్ రోడ్ షో
  • హారతులు పట్టి స్వాగతించిన గ్రామస్తులు
  • ఆశీర్వదించండి అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ 

ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. యువతను అక్కున చేర్చుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చివరి రోజు ఎన్నికల ప్రచారం సాగింది. జన ప్రభంజనం మధ్య దుర్గాడ పరిసర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. జనసేనాని రాక సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగత, సత్కారాలు నిర్వహించారు.  పవన్ కళ్యాణ్ వస్తున్నారని ప్రజలు ఆనందోత్సాహాల నడుమ హారతులు ఇచ్చి, పూల వర్షంతో స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. ప్రతి ఓటు గాజు గ్లాసుకే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని  పవన్ కళ్యాణ్ కి కంచుకోటగా బహూకరిస్తామంటూ ఫ్లెక్స్ లు చూపారు. వినాయకుడి విగ్రహాన్ని బహూకరించి జనసేన అధినేతకు మంచి జరగాలని కోరకున్నారు. తిరుగు ప్రయాణంలో చేబ్రోలు నుంచి పవన్ కళ్యాణ్ నివాసం వరకు ప్రజలతో కలసి పాదయాత్ర చేశారు. మార్గం మధ్యలో యువత, రైతులతో పాటు వివిధ వర్గాలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి తనను ఆశీర్వదించాలని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్చార్జి వర్మ , బీజేపీ ఇన్చార్జి కృష్ణంరాజు , పార్టీ స్టార్ క్యాంపెయినర్స్  సాగర్, జానీ మాస్టర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE