“నేను ముస్లీంను”
ఒకడు గట్టిగా అఱుస్తున్నాడు…
“చాల గొప్పకవిత్వం” అన్నారు
తెలుగు విమర్శక మేధావులు.
“నేను దళితుణ్ణి”
ఒకడు తెగ రంకెలు వేస్తున్నాడు…
“ఎంతో గొప్ప కవిత్వం” అన్నారు
తెలుగు విశ్లేషక మేధావులు.
“నేను క్రైస్తవుణ్ణి”
ఒకడు ఓ కేకలు పెడుతున్నాడు…
“మహాకవిత్వం” అన్నారు
తెలుగు పరిశీలక మేధావులు.
“నేను కమ్యూనిస్ట్ను”
ఒకడు ఆర్తనాదం చేస్తున్నాడు…
“ఉన్నతమైన కవిత్వం” అన్నారు
తెలుగు పరిశోధక మేధావులు.
“నేను మనిషిని”
ఒకడు మామూలుగా అన్నాడు.
“నీకు ఇక్కడ చోటులేదు” అన్నారు
తెలుగు కవి మేధావులు.
ముందు జాగ్రత్త చర్యగా
ఆ మాములు మనిషిపై
దాడి చేశారు మేధావులందఱూ.
మామూలు మనిషికి గాయమయింది.
గాయపడ్డ మామూలు మనిషి
వాళ్లెవరి దగ్గఱా లేని కవిత్వాన్ని తీసుకుని
తిన్నగా భవిష్యత్తులోకి నడిచాడు.
– రోచిష్మాన్
9444012279