Suryaa.co.in

Andhra Pradesh

జేసీ ఫ్యామిలీ తరలింపు

తాడిపత్రి టు హైదరాబాద్
జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు

తాడిపత్రి : భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్‌కు పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే

జేసీ దివాకర్ రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు అంగీకరించలేదు. విషయం తెలుసుకున్న దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రి వచ్చారు. పవన్‌ను కూడా ఇంట్లోకి పంపేందుకు పోలీసులు అంగీకరించలేదు.

తన కన్నతల్లి అనారోగ్యంతో ఉంటే ఇంట్లోకి వెళ్లొద్దంటూ అడ్డుకుంటున్న పోలీసులపై పవన్ మండిపడ్డారు. దాంతో పవన్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండడానికి వీలు లేదని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ క్రమంలో జేసీ ఫ్యామిలీని భారీ భద్రత మధ్య హైదరాబాద్ తరలించారు

LEAVE A RESPONSE