Suryaa.co.in

Telangana

జూపల్లి.. నువ్వు మంత్రివా?,కంత్రీవా?

-ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా?
-తీరు మార్చుకో లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవు, ఖబడ్దార్
– బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

నిజామాబాద్: జూపల్లి.. నువ్వు మంత్రివా? ,కంత్రీవా?, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము లేదా? బీ ఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలదీశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు మార్చుకోవాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో కాలుపెట్టలేవు, ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల హామీల అమలు చేయాలని అడిగిన వారిని పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజా పాలన అంటారా? అని ఆయన మండిపడ్డారు భీంగల్ పట్టణ కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావును కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారని అడిగిన బీఆర్ ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడం అమానుషమని ఆయన తీవ్రంగా ఖండించారు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక కాండ అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆయన ఆరోపించారు. పోలీసులుకాంగ్రెస్ నేతల కొమ్ముకాయడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జికి గురైన బీ ఆర్ ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE