వేమూరు మండలం కుచెళ్లపాడు గ్రామం నుంచి సర్పంచ్తో పాటు 10 కుటుంబాలు, అబ్బనగూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుచెళ్ళపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్యతో పాటు తాడికొండ రామకృష్ణరావు, తాడికొండ రవి కిషోర్, తాడికొండ సుబ్బారావు, పెనుమూడి వెంకట సుబ్బారావు, పెనుమూడి సురేష్, కొల్లూరు గోపికృష్ణ, పెరికల విజయేంద్ర, బూసే నరేష్, పెరికల బాబురావు, తాడికొండ రంగారావు, తాడికొండ విశ్వేశ్వరరావు, పెరికల బుజ్జి, అబ్బనగూడవల్లి మాజీ సర్పంచ్ కొండిశెట్టి వెంకట సుబ్బారావు చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో చేరిన వారిక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జనసేన పార్టీ సమన్వయ కర్త ఊసా రాజేష్, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నల గడ్డ విజయబాబు, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…