Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరిన నంద్యాల ముస్లిం ప్రముఖులు

ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కలిసిరావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన షేక్ అబ్బాస్ తో పాటు 100 మంది అనచరులు, మాజీ కౌన్సిలర్ షేక్ ముర్తుజావలి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.

నంద్యాల పట్టణం ఎస్ ఎన్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంప్ లో వీరందరికీ పసుపు కండువాలు కప్పి యువనేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ముస్లీం మైనార్టీల పట్ల వైకాపా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ముస్లీం మైనార్టీలకు అన్ని విధాల అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. రంజాన్ తోఫాతో పాటు దుల్హన్, రంజాన్ సమయంలో మసీదుల మరమ్మతులకు నిధులు, షాదీ ఖానాలు, హజ్ యాత్రకు వెళ్లేవారికి సబ్సీడీ అందించడం జరిగింది. వచ్చే కూటమి ప్రభుత్వంలో ముస్లీం మైనార్టీలకు అన్ని విధాల అండగా నిలుస్తాం. పార్టీలో చేరిన వారు తెలుగుదేశం విజయానికి కృషిచేయాలని కోరారు.

LEAVE A RESPONSE