Suryaa.co.in

National

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి మనవరాలు..

భారతీయ జనతా పార్టీ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం నాడు బెంగళూరు వసంతనగర్‌లోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న సౌందర్య.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే, సౌందర్య ఉరి వేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మాజీ సీఎం యడ్యూరప్ప పెద్ద కుమార్తె పద్మజ కూతురు సౌందర్య ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సౌందర్య సెంట్రల్ బెంగళూరులోని నివాసం ఉంటోంది.

అయితే సౌందర్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2019లో డాక్టర్ నీరజ్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా… ఎంతసేపటికీ తలుపులు తెరుచుకోలేదు. దీంతో పనిమనిషికి అనుమానం వచ్చి
bs-yediyurappa వెంటనే నీరజ్‌కు ఫోన్ చేసింది. హుటాహుటిన నీరజ్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తలుపులను తెరిచి లోపలకు వెళ్లగా సీలింగ్ ఫ్యాన్‌కు సౌందర్య వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి సౌందర్యది ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా సౌందర్య తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సౌందర్య మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

LEAVE A RESPONSE