Suryaa.co.in

Telangana

కేటీఆర్ తో నిజామాబాద్ ,జగిత్యాల,కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతల భేటీ

నిజామాబాద్ , జగిత్యాల, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ముజీబుద్దిన్ కేటీఆర్ తో సమావేశం అయ్యారు.జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన నేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు.

ఈ‌ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు కెసిఆర్ తమపై ఉంచిన పార్టీ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని, పార్టీ
ktr2 బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా , హనుమంత్ షిండే, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE