Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి, అన్నక్యాంటీన్ , సీఎంఆర్ఎఫ్‌కు రూ.3 లక్షల విరాళం

హైదరాబాద్ : అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

LEAVE A RESPONSE