రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది అనేందుకు కుప్పం ఘటనే నిదర్శనం

– కుప్పంలో టీడీపీ నేతలపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
– శాసనమండలి ప్రతిపక్ష నేతయనమల రామకృష్ణుడు

కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించడాన్ని తట్టుకోలేక జగన్ రెడ్డి.. తన రాక్షసగుంపుతో టీడీపీ నేతలపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది అనేందుకు కుప్పం ఘటనే నిదర్శనం. ప్రతిపక్ష నేతపైనే దాడికి యత్నించడం జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు నిదర్శనం. వైసీపీ అధిష్టానం డైరెక్షన్ లోనే కుట్రపూరితంగా చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకుంటున్నారు. పేదవారికి అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటుచేయడమే టీడీపీ చేసిన తప్పా? పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలను చించివేసిన వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్రంలో రౌడీరాజ్యం, గూండా రాజ్యం నడుస్తోంది. జగన్ రెడ్డి నియంతృత్వ విధానాలు ఎంతోకాలం చెల్లవు. కుప్పంలో కుప్పిగంతులు వేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగబోవని హెచ్చరిస్తున్నాం. ఘటనకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి.

Leave a Reply