Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం

– మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి: రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కలెక్టర్‌ సదస్సులో ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ఈ సమావేశంలో చర్చిద్దాం.. సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దాం.. 1994 నుండి అంటే దాదాపు 30 ఏళ్ల నుండి సీఎం చంద్రబాబు గారితో ప్రయాణం చేస్తున్నాం.. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడు కూడా అదే కమిట్‌మెంట్‌తో ముందుకెళ్తున్నారు.. మిగిలిన జీవితం ప్రజల కోసమే, ప్రతి పనిలోనూ మానవత్వం ఉండాలనే విధంగా అదే తపనతో పరిపాలన అందిస్తున్నారు.

చంద్రబాబు పనితీరు అందరికీ మార్గదర్శకం.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిన పరిస్థితి.. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించిన పరిస్థితి. ఒక లక్షా 14 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

తాజాగా రెండు జిల్లాల్లో రివ్యూ చేపట్టడం జరిగింది.. వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాదనిపిస్తోంది.. రూ.3 కోట్లు ఖర్చు పెడితే సరిపోయేది కానీ అలా కూడా చేయలేదు..దీంతో కేసీ కెనాల్ గత ఐదేళ్లలో నాశనం అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు, ఆకాంక్షలు.. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి.. కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారు.. నేను ఈరోజు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఈ స్థాయికి రావడం వెనుక సీఎం అందించిన ప్రోత్సాహం.. మనమంతా ఆయన అడుగుజాడల్లో పని చేద్దాం.. ఆయన హైదరాబాద్ ని ఎలా ట్రాన్స్ ఫార్మ్ చేశారో అనేది గమనించండి. ఈ రాష్ట్రాన్ని కూడా మళ్లీ పరుగులు పెట్టిస్తారు.

10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనిది ఒక చంద్రబాబు వద్ద నేర్చుకోవచ్చు. చంద్రబాబు వద్ద పనిచేయడం ఒక గొప్ప అవకాశం.. ప్రతి రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నాం. మిగిలిన శాఖలు కూడా ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. ముఖ్యమంత్రి ఈ ఆరు నెలల్లో మూడు నెలల పాటు తన డిన్నర్ ని సెక్రటరియేట్ లో చేశారు.. ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నారు అంటే ప్రజలకు సేవ చేయాలి, పని చేయాలి అనే తపన.. ఆయన పని చేస్తున్న తీరు చూస్తే, మనలో ఓ నమ్మకం ఏర్పడుతుంది.. ఈ రాష్ట్రాన్ని పునర్మించడానికి మనవంతు పని చేద్దాం.. మన సీఎం టీమ్ గా.. ప్రజల కోసం పనిచేద్దాం.. రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే పరిస్థితుల్లో మీరున్నారు.. దీన్ని సద్వినియోగం చేసుకుందాం..

LEAVE A RESPONSE