Suryaa.co.in

Andhra Pradesh

కలిసి పనిచేద్దాం

-నూకల రామకోటేశ్వరావు కళ్యాణ మండపంలో ఆత్మీయ -సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి నాయకులు కార్యకర్తలు

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ … గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నాతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. గతంలో మనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటాను. గడిచిన పలు దఫాల అభ్యర్ధల ఎంపిక విషయంలో ఏకడో ఒక్కచోట అవకాశం వస్తుందని భావించాను అవకాశం లేకపోయినా బాధ లేదు. మనకు సీటు ఇస్తాను అన్న గుంటూరు, కృష్ణ,జిల్లాల్లో నీ ప్రతి చోట నాకు అనుకూలంగా సర్వే ఉన్న నాకు అవకాశం రాలేదు. పార్టీ చెట్టు లాంటిది చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం మనగలుగుతాము. నా వ్యక్తిగత స్వార్దం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువుగా ఏర్పడింది.

స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్దం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దాం. ఆకరి నిమిషం వరకు పోరాడాలని భవనంతో జీవితం గడపాలని భావిస్తున్న కొంత మంది దాన్ని వేరే విధంగా చూస్తున్నారు. వ్యక్తి గత స్వార్దం కోసం నన్ను కొంత మంది విభేదించిన వారి పట్ల తనకు విభేదం లేదు. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు,ప్రజా శ్రేయస్సే ముఖ్యం. పార్టీలో ఉండటంలోనే నాకు అనేక పదవులు అదిరోహించను. గతంలో ఎన్నడూ లేని ఒక గొప్ప విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా. పార్టీ ఉంటేనే మనం నిలబడగలుగుతము కలిసి కట్టుగా గెలుపు కోసం పోరాడుదాం. తన భవన నీ సమర్ధిస్తూ అందరు కలిసి రావాలని అలా రాలేని పక్షంలో నాయక్త్వన్ని నుండి తప్పుకోవటానికైనా సిద్దంమే నన్నారు.

LEAVE A RESPONSE