మహిళపైకి దూసుకెళ్లిన లారీ..కాళ్లు నుజ్జునుజ్జు

రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించే మహిళ పైకి అమిత వేగంతో వచ్చిన లారీ ఒకటి దూసుకుపోయిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల ఆమోదగిరీపట్నంలో జరిగింది. వీరమ్మ అనే మహిళ రోజువారీ రోడ్ పక్కన కూరగాయలు అమ్ముకుంటూ ఉండగా ఒక లారీ ఆమె పైకి దూసుకెళ్లింది. దీంతో లారీ చక్రాల కింద పడి ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.

అతి కష్టం మీద ఆమెను లారీ కింద నుండి బయటకు తీయగలిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో న అంబులెన్స్ వచ్చి ఆమెను చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని లారీని స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.

Leave a Reply