సుబ్బారాయుడు…తగ్గేదేలే!

– జిల్లా కేంద్రం కోరుతూ ‘కొత్తపల్లి’ ఆధ్వర్యంలో పడవలతో ర్యాలీ

నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చే అంశంలో సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే తిరుగుబాటు బావుటా ఎగరేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తాజాగా మరో సాహసానికి తెరలేపారు. జిల్లా కేంద్ర సాధనలో ఎక్కడా తగ్గేదేలా అంటున్నారు.

నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. నర్సాపురంని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ గత ముప్పై ఐదు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నిడదవోలు ప్రధాన కాలువలో పడవలను ఏర్పాటు చేసుకుని బస్టాండ్ దగ్గర నుండి రుస్తుం బాధ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని జిల్లా రాజధాని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని,, ఏఎంసీ ఉపాధ్యక్షులు వైయస్ బాబులు, ఏఎంసీ మాజీ చైర్మన్ దొండపాటి స్వాములు, వన్నెం రెడ్డి శ్రీనివాస్, పోలిశెట్టి సూరిబాబు, యాదవ రెడ్డి మహేష్, గాది వన మయ్య, ఆరేటి మృత్యుంజయ తదితరులు పాల్గొని జిల్లా కేంద్రం ఇవ్వాలని నినాదాలు చేశారు.

Leave a Reply