మంత్రి సురేష్ మా పొలం ఆక్రమించారు

– స్పందనలో మంత్రి సురేష్ పై ఫిర్యాదు చేసిన మహిళ

ప్రకాశం :మంత్రి ఆదిమూలపు సురేష్ పై మూడు ఎకరాల భూమిని ఆక్రమించారని మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగ లక్షమ్మ, జిల్లా కలెక్టర్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి లో ఈరోజు స్పందన కార్యక్రమం నిర్వహించారు. మంత్రికి చెందిన జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మాకు మూడు ఎకరాల భూమి ఉందని, ఆ పొలాన్ని మంత్రి సురేష్ ఆక్రమించారని ఎంతమందికి ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని, మీరైనా న్యాయం చేయండి అని జిల్లా కలెక్టర్ ఆ మహిళ విన్నవించింది.

Leave a Reply