చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారు

– 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది
ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు
– చంద్రబాబు అరెస్టును ఖండించిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్

చంద్రబాబు అరెస్టు తప్పుడు విధానంలో జరిగింది. చంద్రబాబును చూసి జగన్ భయపడుతున్నారు.కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారు. చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా ఎదుగుతారు. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ఏం చేశాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రజలకు తెలుసు. ప్రజల సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లారు. చంద్రబాబుపై పెట్టిన కేసు కోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నా.