– విజయవాడ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతను కఠినంగా శిక్షించాలి
– వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులతో విజయవాడ భవానీపురంకు చెందిన 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన వింటుంటే చాలా బాధేస్తోంది. 60ఏళ్ల వ్యక్తి, ఒక ప్రజా ప్రతినిధిగా పోటీ చేసిన వ్యక్తి పద్నాలుగేళ్ల బిడ్డను ఓ తండ్రిలా చూడాలి కానీ, ఇలా లైంగికంగా వేధించడం ఎంతవరకూ సమంజసం…?
ఇలాంటివాళ్లకి కచ్చితంగా బుద్ధి చెప్పేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియచేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గత అయిదేళ్లలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకూ వారిపై అత్యాచారాలు జరిగాయి. మహిళా వ్యతిరేకి అయిన చంద్రబాబు వల్ల, టీడీపీ నాయకులు అంతా ఏవిధంగా మహిళలను హింసించారు, వేధించారు, కాల్మనీ, సెక్స్రాకెట్ పేరుతో ఎంతోమందిని వ్యభిచార కూపంలోకి దించారో కళ్లారా చూశాం.
అలాగే వనజాక్షిలాంటి సిన్సియర్ అధికారిణిపై ఎలా దాడి చేశారో చూశాం. అలాగే చదువుల తల్లి రిషితేశ్వరిని ఎలా పొట్టన పెట్టుకున్నారో చూశాం. ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్కు విరుద్ధంగా ఏవిధంగా సస్పెండ్ చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు.
ఇలాంటి పనికిమాలినవాళ్లు, దొంగలు… నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామంటున్నారు. ఏ మొహం పెట్టి ఆ దీక్షలు చేస్తారని మేము అడుగుతున్నాం. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయిన బాలిక ఇంటి ముందు కూర్చుని సంకల్ప దీక్షలు చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని?
ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళా భద్రత కోసం దిశా పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. దిశ యాప్ తీసుకువచ్చి దానిద్వారా ఫిర్యాదు చేసిన అయిదు నిమిషాల్లోనే అక్కడకు పోలీసులు చేరుకుని బాధితులకు రక్షణ కల్పించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. 14 ఏళ్ల బాలిక ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. అదే దిశ యాప్ద్వారా ఫిర్యాదు చేసినా ఇవాళ ప్రాణాలతో ఉండేది.
మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పు చేసినవాళ్లకు శిక్ష పడేలా చేయాలి కానీ, మీలో మీరే కుమిలిపోయి, డిప్రెషన్లోకి వెళ్లిపోయి, ప్రాణాలు తీసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో దయచేసి ఆలోచించండి.
దొంగలే దొంగ.. దొంగ అన్నట్లుగా…తెలుగుదేశం పార్టీ మహిళల వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో మహిళలపై ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న లోకేష్ పీఏ మహిళలను లైంగికంగా వేధించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద దీక్షలు చేయడం మనం కళ్లారా చూశాం.
టీడీపీ వాళ్లు చేసిన తప్పులను ఒకవైపు సమర్థించుకుంటూ.. మరోవైపు చంద్రబాబు నాయుడును కాపాడుకుంటూ.. జగన్ మోహన్ రెడ్డిగారి పై బుదర చల్లాలని దీక్షలు చేసేవారిందరికీ గట్టిగా బుద్ధి చెప్పేవిధంగా అందరూ సహకరించాలి.
విజయవాడ బాలిక రాసిన సూసైడ్ నోట్లో వినోద్ జైన్ ఏవిధంగా ఆమెను వేధించాడో తెలుస్తోంది. అది చదువుతుంటే చాలా బాధేస్తోంది. ఆమె ఎవరికీ చెప్పుకోలేక ఎంతో వేదనకు గురై ప్రాణాలు తీసుకుంది. ఆ అమ్మాయి చివరి కోరిక అయిన వినోద్ జైన్ను కఠినంగా శిక్షించాలని కోరుకుంది. ఆమె చివరి కోరికను ప్రభుత్వం నెరవేర్చాలి. పోలీసులు ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా తప్పు చేసినవాడిని కఠినంగా శిక్షించాలి. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జరగకుండా మహిళకు భద్రత ఇచ్చే విషయంలో ఆయన వందశాతం నిబద్ధతతో ఉన్నారు.
ఇలాంటి వెధవలు చేసే పనులకు తక్షణమే శిక్షించేలా సెక్షన్లు నమోదు చేసి, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా నేరస్తులను శిక్షించే విషయంలో ముఖ్యమంత్రిగారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఇలా మరో బాలిక బలి కాకూడదు. తెలుగుదేశం పార్టీలో బరితెగించినవారికి బుద్ధి వచ్చేవిధంగా ఈరోజు నుంచి ర్యాలీలు చేసి మహిళలను చైతన్యపరచాలి. దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ తో పాటు ప్రతి సచివాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటం వల్ల మహిళలు తమ సమస్యలను వారితో చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఆపదలోనూ, కష్టంలో ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.