అవినీతి చెదల వల్ల దేశం గుల్ల : మోది

న్యూఢిల్లీ : అవినీతి అంటే ఓ చెడ్డ వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ చెదను త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ప్రజల కోసం. 2022లో తొలి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు.

కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు. ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తాయని, విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు. మన దేశ భవిష్యత్తు పట్ల నూతన తరం దృక్పథం విస్తృతంగా, సమగ్రంగా ఈ పోస్ట్ కార్డుల ద్వారా తెలిసిందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డ్‌లోని పరిశీలన ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్లు చెప్పారు.

అవినీతి రహిత భారత దేశం గురించి మాట్లాడుతుందని, అవినీతి అంటే చెడ్డదని, దీనివల్ల దేశం గుల్ల అవుతుందని అన్నారు. ఈ చెద నుంచి బయటపడటానికి 2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. ఈ కృషిని త్వరగా చేపట్టాలన్నారు. మన విధులు, కర్తవ్యాలను నిర్వహించేందుకు మనం ఇష్టపడటం చాలా ముఖ్యమని అన్నారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు.

భారతదేశంలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసినట్లు తెలిపారు. ఈ భావోద్వేగ, ఉత్తేజకరమైన సమయంలో అమర వీరుల కుటుంబ సభ్యులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారని తెలిపారు.

Leave a Reply