Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీపై ఎమ్మెల్సీ జంగా తిరుగుబాటు

-బీసీలకు పదవులు ఇచ్చారు.. అధికారాలు ఏవి?
-వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీలలో నెయ్యి లాంటిది
-బీసీలకు పార్టీలో గౌరవం లేదు
-అన్ని పదవులు ఒకే వర్గానికి?
-మీడియాతో వైసిపి ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి

వైసిపిలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడంలేదని, గౌరవం ఇవ్వడంలేదని, ప్రోటోకాల్‌ పాటించడంలేదని వైసిపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు.

బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కష్ణమూర్తి స్పష్టం చేశారు.

కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారని.. రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

LEAVE A RESPONSE