Suryaa.co.in

Telangana

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని మోడీ ఒప్పుకున్నారు

– ఎమ్మెల్సీ కాంగ్రెస్ జీవన్ రెడ్డి

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని మోడీ మరోసారి ఒప్పుకున్నారు.యువత బలిదానాలను ఆపాలనే మెజారిటీ లేకుండా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించాలనే దుర్బుద్ధి తప్ప వేరే లేదు. కేసీఆర్- నరేంద్రమోదీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళకుండా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ కాకుండా తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చింది. ఐటి ఉద్యోగాలు తెలంగాణ యువతకు వస్తున్నాయా? ఎవరికి వెళ్తున్నాయో చెప్పాలి?

దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మోడీ కార్యక్రమాలు ఉంటున్నాయి.కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం ఉద్దేశ పూర్వకంగా చేసింది.తమ ఇష్టమున్న దుస్తువులు వేసుకునే హక్కు అడబిడ్డలకు- మహిళలకు ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పీఎం చదువుకోవాలి- కాంగ్రెస్ పార్టీ గురించి నైతికత మోడీకి లేదు.

తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ నోరు మెదుపడా? మోడీ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించాలి.హిజాబ్ ఇవ్వాళ కొత్తగా ఉన్నది కాదు- కాని ఇప్పుడే ఎందుకు అల్లర్లు అవుతున్నాయి?ఐదు రాష్ట్రాల ఎన్నికల స్టెంట్ గా హిజాబ్ ను వాడుకుంటున్నారు. సమతామూర్తీ దర్శనం ఎన్నికల స్టెంట్ లో భాగమే! దేశం ఇవ్వాళ కొత్తగా అభివృద్ధి చెందుతుందా? దేశం కోసం బీజేపీ ఏం త్యాగం చేసింది? సమతా మూర్తి హిందువులో ఒకటైన వైష్ణవ మతాన్ని మాత్రమే ఆరాదిస్తున్నారు. ఇతర మతాల వాళ్ళు ఇండియాలో భాగం కాదా? ఎకానామిక్ అఫెండర్స్ కు ప్రాధాన్యత- ఒక రాజకీయ పార్టీకి మాత్రమే ఎందుకు ఇటున్నారు? అది రాజకీయ వేదిక?

LEAVE A RESPONSE