Suryaa.co.in

Telangana

ప్రచారంలో దూసుకుపోతున్న ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

-సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
-మళ్ళీ కారుకే ఓటు వేస్తామంటున్న ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజానీకం
-గత ప్రభుత్వ పథకాలు మాకు అందినాయి
-మళ్ళీ కారుకే ఓటు వేస్తాం అంటున్న కవాడిగుడా డివిజన్ లోని బస్తీ వాసులు

ముషీరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం లో అడుగడుగునా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పడుతున్న పలు కాలనీల లోని ప్రజలు. కవాడి గూడ డివిజన్ లోని పలు కాలనీల లో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్.

ఉన్నికోట బస్తి , ముక్కు బస్తి , తాల బస్తి , కురుమ సంఘం , మజీద్ గల్లీ , శివాజీ చౌక్ , దామోదర్ సంజీవయ్య నగర్ , ఎస్.బి.ఐ కాలనీ లలో ప్రతి ఇంటికి తిరుగుతూ గత పదేళ్ల లో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించిన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ , ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్.

అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం.కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు.హైదరాబాద్ నగరాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినందుకె మా పార్టీ నుండి ఐదు మంది ఎం.ఎల్.ఏ లను ప్రజలు గెలిపించిండ్రు.మేమంతా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం.

కొన్ని కాలనీలలో నా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకోచిండ్రు.వాటిని నేను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న. కొంత మంది సంబంధం లేని విషయాలపై ప్రజలను మభ్య పెడుతూ , లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు.ప్రజలు ఎవ్వరు నమ్మకండి. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది.

LEAVE A RESPONSE