Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లు గాడిదలు కాశావా జగన్‌?

-చెత్త పార్టీ..చెత్త నాయకులకు ఓటేయొద్దు
-వెలిగొండ ఆరు నెలల్లో పూర్తిచేస్తానన్నావు
-మోసగించడానికే సిద్ధం అంటున్నావా?
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి
-ఎర్రగొండపాలెంలో బహిరంగ సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు జిల్లా ఎర్రగొండపాలెంలో సోమవారం భారీ బహిరం గ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే బాగా సంపాదించాడు అంట కదా..కమీషన్లు మొత్తం దోచేశారట కదా..ఆయన మంచోడు అయితే ఇక్కడ నుంచి ఎందుకు మార్చారు? ఈయన చెత్త అని వీళ్లే ఒప్పుకున్నారు కదా? ఇలాంటి చెత్తలకు, చెత్త పార్టీలకు ఓటు వేయడం అవసరమా? అని ప్రశ్నించారు. జగన్‌కు ఓటు వేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుందనుకున్నారు. ఆయన ఏం ఉద్ధరించారు? వెలుగొండ ప్రాజెక్ట్‌ వైఎస్సార్‌ కట్టాలని అనుకున్న ప్రాజెక్టు. 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు , 15 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు.

వైఎస్సార్‌ హయాంలో 60 శాతం పూర్తి చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్‌ పూర్తి చేయలేకపోయారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు చంద్రబాబును విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామ ని చెప్పారు. ఐదేళ్లు అధికారం అనుభవించి తట్టెడు మట్టి తీయలేదు.. వెలుగొండ పూర్తి చేయ కుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? వైఎస్సార్‌ వారసులు వీళ్లా? అని ధ్వజమెత్తారు. సాగు నీరు లేదు..తాగునీరు లేదు.. గుక్కెడు నీళ్ల కోసం ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. నియో జకవర్గంలో వలసలు పోతున్నారు. రైతులకు కనీసం డ్రిప్‌ ఇరిగేషన్‌ కూడా లేదని మండిపడ్డా రు. ఒక్క హామీ నిలబెట్టకుండా ఇప్పుడు సిద్ధం అంటూ బయలుదేరాడు.. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చకుండా మోసం చేయడానికి సిద్ధమా? మద్యనిషేధం అని హామీ ఇచ్చి కల్తీ మద్యం అమ్మడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేయడానికి సిద్ధ మా? అని ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE