Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల మద్దతు టీడీపీకే

-మంగళగిరికి వచ్చిన వివిధ జిల్లాల శ్రేణులు
-టీడీపీతోనే సామాజిక న్యాయం: వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు: చంద్రబాబుపై నమ్మకంతో నంద్యాల, వివిధ జిల్లాలకు చెందిన 600 మంది గిరిజనులు సోమవారం తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వారంతా ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి ఓంకార్‌ నేతృ త్వంలో గిరిజన సమైక్య సమ్మేళనం పేరుతో మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చారు.

అనంతరం సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని దళిత గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తదితర వర్గాలన్నీ చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలియజేశారు. దళిత-గిరిజనుల స్థితిగతులు మారాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE