ముఖ్యమంత్రి జగన్ తో మున్నూరు కాపు సంఘం నేతల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు ఈరోజు కలిశారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జగన్ ను కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వరద పర్యటన సమయంలో జగన్ ను కలిసిన మున్నూరు కాపులు తెలంగాణ మాదిరి తమను బీసీ-డీలో చేర్చాలని కోరారు. వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన జగన్… వారిని బీసీ-డీ కేటగిరీలో చేర్చారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమా శంకర్ మాట్లాడుతూ, బతికినంత కాలం తాము జగన్ వెనుకే నడుస్తామని చెప్పారు. తమ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

Leave a Reply