Suryaa.co.in

Andhra Pradesh

మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేష్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు. ఆదివారం ఉద‌యం త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మిణి, త‌న‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.

పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. రాజ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. శివాలయంలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లుచేశారు. అనంత‌రం పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నారు. కొండ‌పైన ఉన్న‌ రాజ్యలక్ష్మి అమ్మవారిని పూజించి హారం, పట్టువస్త్రాలు సమర్పించారు.

LEAVE A RESPONSE