Suryaa.co.in

Andhra Pradesh

తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడు

– డాక్టర్ లోకేష్‌ను పరామర్శించిన టీడీపీ నేతలు
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

విజయవాడ: గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా సిటిజన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్ పై సీఎం భద్రత సిబ్బంది దాడి చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీనియర్ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మీడియా ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర ఇతర నేతలతో కలిసి, విజయవాడలోని ఎల్ఐసి కాలనీలోని డాక్టర్ లోకేష్ స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ లోకేష్ పై 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు దుర్మార్గం. ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ ని గుర్తు పట్టిన వైసీపీ నాయకులు సీఎం సెక్యూరిటీకి సమాచారం అందించారు.

ఒక సీనియర్ డాక్టర్, అమెరికా సిటిజెన్ ను మ్యాన్ హ్యాండిల్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో, సీఎం సెక్యూరిటీ అధికారులు ఈ పనిచేశారో స్పష్టం చేయాలి. అమెరికన్ సిటిజన్ అయినా మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై సోషల్ మీడియాలో స్పందించినందుకే కక్ష కట్టారు.

పేరుపొందిన ప్రఖ్యాత వైద్యులు, ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన వ్యక్తి డాక్టర్ లోకేష్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ కూడా చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఎవరి ప్రోత్సాహం, ప్రోద్భలంతో ఈ పనులు జరిగాయి ? తక్షణమే బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తాం. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడు.

LEAVE A RESPONSE