Suryaa.co.in

Andhra Pradesh

నేటి నుంచే నామినేషన్లు

– ప్రీ-పోల్‌ సర్వే , ఒపినియన్‌ పోల్‌ సర్వేలన్నీ బంద్

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిషికేషన్‌ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.

అదే విధంగా, నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది.. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరించ నున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లకు పుల్‌ స్టాప్‌ పడ్డట్టయింది.. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించ కూడదు, ప్రజలకు వెల్లడించ కూడదు. ప్రీ-పోల్‌ సర్వే కానీ, ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు..

ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 పార్లమెంటు నియోజక వర్గాలు
తెలంగాణ లోనూ మే 13 నే ఎన్నికలు
తెలంగాణలో 17 పార్లమెంటు నియోజక వర్గాలు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక.. జూన్ 4న ఓట్ల లెక్కింపు

LEAVE A RESPONSE