ఇది బాహుబలి దృశ్యం కాదు… బతుకు చిత్రం . ఎడతెరపి లేని వర్షాల కారణంగా విశాఖ మన్యంలో రహదారులు వంతెనలు లేక, గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ప్రతిబింబం . ఆ పసిబిడ్డకు నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం. ఎడతెరిపిలేని వర్షాలు ఉధృతంగా పారుతున్న వాగు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ పసిబిడ్డకు ఏమవుతుందో అని ఆ తండ్రి చేసిన సాహసం. బిడ్డను చేతులతో పైకెత్తి తల మీద పెట్టుకుని, పీకల్లోతుల్లో వాగులో దిగి అవతలి ఒడ్డుకు చేరి, లోతుగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి బిడ్డను తీసుకుని వెళ్లాడు. ఆ నాన్నకు జేజేలు.ఆ పాపకు ఆశీస్సులు.సారు.. ఓ పాలి ఆ గిరిజన గ్రామాల వైపు చూడండి అని ..పాలక ప్రభువులకు వేడుకోళ్లు విన్నపాలు. తమ ప్రాణాలు పణంగా పెట్టి.. తమ కనురెప్పలను కాపాడుకునేందుకు సాహసించిన ఇలాంటి బాహుబలులైన తండ్రులకు జోహార్లు. ఇది ఏపీలోని గిరిజన ప్రాంతాల విషాదానికి .. కనీస సౌకర్యం కల్పించలేని పాలకుల అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం. కాదంటారా? కాదనే వారికి ఈ ఫొటోనే సాక్ష్యం!
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…