Suryaa.co.in

Andhra Pradesh International

అడిలైడ్ ,సౌత్ ఆస్ట్రేలియాలో ఘనంగా NTR శతజయంతి ఉత్త్సవాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు  శత జయంతి సంవత్సర ప్రారంభ ఉత్సావాలు అడిలైడ్ నగరం లో ని ఫ్లిండర్స్ పార్క్ కమ్యూనిటీ సెంటర్ లో ఘనం గా నిర్వహించారు. సినిమా మరియు రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు, తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని ఆనందించారు. సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదం తో మారుమ్రోగింది . ఇదే సందర్భంగా TDP NRI Cell సౌత్ ఆస్ట్రేలియా విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షులుగా Dr నవీన్ కుమార్ నేలవల్లి , ఉపాధ్యక్షులుగా రవీందర్ రెడ్డి టేకుల , కార్యదర్శి గా శ్రీమతి స్రవంతి కొండవీటి , అదనపు కార్యదర్శి గా శ్రీ సందీప్ పాతూరి , కోశాధికారిగా  చైతన్య పాలిశెట్టి గార్లను ఎన్నుకున్నారు . ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వ దారుణాలు , దిగజారిపోయిన రాష్ట్ర ఆర్ధిక సామాజిక పరిస్థుతుల మీద ఇక్కడి ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేసారు.ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి , సంక్షేమం సమపాళ్లలో చేయగలిగిన సత్తా  చంద్రబాబు నాయుడికే ఉందని బలంగా విశ్వసించారు. రాష్ట్ర అభివృద్ధి కి తమవంతు సహకారం అందిస్తామని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి ఇండియా నుండి జూమ్ కాల్ లో టీడీపీ సీనియర్ నాయకులు నన్నపనేని రాజకుమారి, తెనాలి శ్రవణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గౌతు శిరీష, మొహమ్మద్ నజీర్ , యరపతినేని శ్రీనివాసరావు  మరియు టీడీపీ NRI సెల్ కన్వీనర్ రాజశేఖర్  ప్రసంగించి తమ శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్రాన్ని కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుల చేతుల నుండి విముక్తి చేయడానికి ప్రపంచంలోని ప్రతి తెలుగు వాడు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

వందలాది గా ఇక్కడ నివసించే తెలుగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ సభ లో ప్రత్యేకంగా ప్రసంగిచి ఉత్సాహాన్ని నింపిన  Dr శ్రీధర్ నన్నపనేని ,  రమేష్ నల్లపునేని , ఇంత విజయవంతంగా సభని నిర్వహించిన  శ్రీనివాసరావు సూర్యదేవర ,  సుమన్ కుమార్ వసంతం ,  సుమంత్ కొమ్మినేని ,  సుకన్య వేజెళ్ళ గార్లకు మరియు ఇతర యువ కమిటి మెంబెర్స్ కు కమిటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

LEAVE A RESPONSE