Suryaa.co.in

Political News

ఓబులాపురం గనుల దోపిడీ

(అడుసుమిల్లి శ్రీనివాసరావు)

అంతు లేని సంపద పోగుపడింది.
పరిటాల రవీంద్ర గారి అడ్డు తొలగించుకున్నారు.
అంతకు ముందు ఆయన అనుచరుల్ని వరుసగా హతమార్చారు.
ఆనాటి పాలకుడి రక్తదాహం.

దేవుడిచ్చిన కొడుకు..సొంతకొడుకు..ఇద్దరూ తరాలకు తరగని ఐశ్వర్యం.
ఒళ్ళు తెలియని మదం.
కండకావరం.
ఇది అన్యాయం..అక్రమం అంటూ అడ్డుకున్న అఖిలపక్షం మీద దాడి..!
ప్రముఖంగా పోరాడిన ఆనాటి తెలుగుదేశం నాయకులు నాగం జనార్ధన రెడ్డి గారు.
అమ్మవారి గుడిని కూల్చారు.
ఇది అపచారం అంటే వెక్కిరించారు.

కలియుగవైకుంఠం శ్రీ వేంకటేశ్వరుడి క్షేత్రంలో ప్రతి పువ్వు ఆయన అర్చనకే.
నిత్యకళ్యాణం పచ్చతోరణం.
ఆయన సమక్షంలో బంగారు కిరీటం ధరించి స్వామి వారిని వెక్కిరించాడు.

అలంకారానికి వినియోగించే సువర్ణాన్ని మలమూత్రాలు విసర్జించే మరుగుదొడ్లో వినియోగించాడు.
కన్ను మిన్నూ కానని కండకావరంతో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిని అసభ్యంగా దూషించాడు.
పాపం పండి జైలు పాలయ్యాడు.
ఇతని పాపానికి ప్రలోభానికి ఏకంగా న్యాయమూర్తి కూడా బలయ్యాడు.

క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది.
చంద్రబాబు గారిని క్షమాపణ వేడుకున్నాడు మీడియా సాక్షిగా.

ఒకటి మాత్రం నిజం!
చంద్రబాబు గారిని అన్యాయంగా విమర్శించినా..దూషించినా..వారికి ఏదో రూపంలో శిక్షపడుతుంది.
ఇది చరిత్ర చెప్పిన సత్యం.

వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని బాబు గారు వదిలేస్తారు.
కాని కర్మ మాత్రం వారిని వదలదు.

ఎట్ట కేలకు దేవుడిచ్చిన కొడుకు పాపం పండింది.
ఇక అసలు కొడుకు వంతు!
అందరూ ఎదురు చూస్తున్నారు.

త్వరలో మద్యం స్కామ్ లో లోపలికి వెళ్ళక తప్పదు.
వెంటనే అక్రనాస్ధుల కేసులో బెయిలు రద్దు అనివార్యం.
ఇక రోజు వారి విచారణకు హాజరవ్వక తప్పని పరిస్ధితి‌.
అన్ని శిక్షలు ఒకదాని వెనుక మరొకటి తప్పదు.

LEAVE A RESPONSE