Suryaa.co.in

Political News

నిజాయితీ నిబద్దత కు నిలువటద్దం

– దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి
– విద్యాధికులు

ఒక అద్భుత సన్నివేశం..
సంజీవయ్య గారి భార్య వద్దకు వచ్చిన వారు..అమ్మా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు అని తెలియచేసారు!
జీతభత్యాలు ఏమన్నా కొద్దిగా పెరుగుతాయా అని అడిగారు ఆమె!
ఆర్ధికంగా ఏమాత్రం స్ధితిమంతులు కాదు!
రాజకీయాల్లో రాణిస్తున్నా దుడ్లు వడ్లు కరువే!

రాష్ట్రాధినేత అయినా సొమ్ముకు కటకటే!

ఆ పదవి లో ఆయన్ని భరించలేదు..సహించలేక పోయారు.
రాజ్యాధికారం మా జన్మహక్కు!
అదే భావజాలం..!
ఇతరులు ఆ పదవి కి తగరు అన్నదే వారి వాదన!
అందుకే దించే వరకు కంటి మీద కునుకు లేదు!
నిజాయితీ పరులకు పదవులు తృణప్రాయం!
సిరిసంపదలు అంగుష్ఠమాత్రం!
అందుకే పదవి వదిలి నిశ్చింతగా..నిరాబరీ గా మొదటి ఆట తెలుగు సినిమా కి భార్యాసమేతంగా రిక్షాలో వెళ్ళిన నిరాడంబరుడు!

ఆయన ఎప్పటికీ స్మరణీయులు!

అధికార..కులదురహంకారం ముందు..వారి కీర్తి ప్రతిష్డలు మసకబారవచ్చు!

నిజం !
దాచేస్తే దాగేది కాదు!

ఆచంద్ర తారార్కం వారు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు!

వారి దివ్య స్మృతి కి ఘననివాళి!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE